‘మనం ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో నాగార్జున నిర్మించబోయే సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించనున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. పృథ్వీ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. నాగార్జున తన సొంత సినిమాలను నిర్మించుకోవడంతో పాటు అప్పుడప్పుడు బయటవారితో కూడా సినిమాలు తీస్తుంటాడు.గతంలో చాలా సినిమాలను నిర్మించారు. ఆయన చివరిగా నిర్మించిన చిత్రం ‘రంగుల రాట్నం’. ఇక ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో నాగార్జున నిర్మాతగా కొంచెం బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు తన దగ్గరకు ఒక మంచి కథ వచ్చిందట..
ఆ కథని వైష్ణవ్ తేజ్ తో చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట నాగార్జున...ఇక వైష్ణవ్ తేజ్ కూడా ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడట.. ఈ సినిమాకి రెమ్యునరేషన్ గా వైష్ణవ్ తేజ్ కు రూ.3 కోట్లు ఇవ్వాలని నాగ్ నిర్ణయించుకున్నాడట.ఇక భోగవల్లి ప్రసాద్ నిర్మించనున్న సినిమాకి గాను వైష్ణవ్ తేజ్ మూడు కోట్లకు దగ్గరగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అందువల్ల నాగార్జున కూడా వైష్ణవ్ కి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నాడని ఇండియా హెరాల్డ్ కి సమాచారం అందింది...మరి వైష్ణవ్ నాగార్జున భారీ పారితోషికానికి న్యాయం చేసి మంచి హిట్ కొడతాడో లేదో చూడాలి. ఇంకా మరిన్ని పూర్తి వివరాలు త్వరలో వెళ్లాడవబోతున్నాయి....