యూ ట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్కు భారీ ఆఫర్ ఇచ్చి సీజన్ 5 కోసం లాక్ చేసారని తెలుస్తుంది. సీజన్ 2లో ఈయన ప్రేయసి దీప్తి సునయన వచ్చింది. అక్కడ బాగానే పాపులర్ అయింది ఈమె. ఇప్పుడు సీజన్ 5 కోసం షణ్నును అడుగుతున్నారు. మరోవైపు ఈయనతో పాటు టిక్ టాక్ దుర్గా రావు కూడా సీజన్ 5 కంటెస్టెంట్గా కన్ఫర్మ్ అయిపోయాడు. కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాడు దుర్గా రావు. ఇదిలా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ తర్వాత కెమెరాలు ఆఫ్ చేయమని, తాను యాక్సిడెంట్ చేసినప్పటికీ, ఎవరూ హాస్పిటల్ లో పడలేదు, కదా అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. తాగి వాహనం నడిపి, యాక్సిడెంట్ చేసి బాధితులు ఆసుపత్రిలో పడనంత మాత్రాన తప్పు జరగనట్లేనా అంటూ నిలదీస్తున్నారు.
మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ యాక్సిడెంట్లో మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలను షణ్ముఖ్ కారు ఢీ కొట్టింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నటుడు షణ్ముఖ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.యితే షణ్ముఖ్ జస్వంత్ మద్యం మత్తులో ఇలా చేయడం వెనుక బలమైన కారణం ఉందనే పేరు వినిపిస్తోంది. అతడితో పాటు కారులో ఎవరెవరు ఉన్నారు. అనే కోణంలో కూడా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. కాగా కారులో అతడితో పాటు మరో అమ్మాయి కూడా ఉందనే సమాచారం బలంగా వస్తోంది. దీనిపై విచారణలో నిజాలు బయటపడే అవకాశం ఉంది.