టాలీవుడ్ టాప్ హీరోలకు క్లాష్ ఎప్పుడూ అవుతూనే ఉంటుంది. ఆ క్లాష్ డేట్ ఎప్పుడొస్తుందా అని అటు హీరోల ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. కొందరు హీరోలు పనిగట్టుకుని మరీ సీజన్లు చూసి ఫైట్ చేసుకోవడానికి ట్రేడ్లో తమ సత్తా చాటుకోవడానికి రెడీ అయిపోతుంటారు. తాజాగా వచ్చే సంక్రాంతికి అలాంటి అరుదైన క్లాష్ జరగబోతుంది. ఆ క్లాష్ ఎవరిదో కాదు పవన్ -మహేష్ ల మధ్యనే. లాస్ట్ టూ డికేడ్స్ నుంచి ఫైట్  చేసుకుంటున్న ఈ ఇద్దరు హీరోలు ఇప్పటివరకు డైరెక్ట్ గా ఒకే రోజు తలపడింది లేదు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఒకే  టైమ్ లో వచ్చి తాడో పేడో తేల్చుకోబోతున్నారు.

ముందుగా సంక్రాంతికి బెర్త్ కన్ఫామ్ చేసుకున్న ఫిలిం సర్కారు వారి పాట. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ ఫిలింను చాలారోజులుగా షెడ్యూల్ చేస్తూనే ఉన్నారు. అయితే షూటింగ్ పూర్తయి ఫస్ట్ ప్రింట్ వచ్చేసరికి ఎంత లేదన్నా ఈ ఏడాది చివర అవుతుంది. ఇంతకాలం ఎలాగు వెయిట్ చేశాం కాబట్టి ...ఆ వచ్చేదేదో సంక్రాంతికే వస్తే ఓ పనైపోతుందనే లెక్కలోనే మహేష్ ఉన్నాడు. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు నేను వస్తున్నాను అంటూ ముందుగానే చెప్పేశాడు. మహేష్ వస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో చెర్రీ లేదా బన్నీ ఫిలిం రిలీజ్ అయ్యే పరిస్థితులైతే ఈ సారి కనిపించడం లేదు. సో మహేష్ ఫైట్ సోలోనే అనుకున్నారంత.

కానీ ఉన్నట్టుండి పవన్, క్రిష్ ల వీరమల్లు వచ్చే ఏడాది సంక్రాంతికి అంటూ మేకర్స్ చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా ట్రేడ్ ఈక్వేషన్స్ మారిపోయాయి. సర్కారువారి పాటపై కర్చీఫ్ వేసుకున్న ముందస్తు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు
తాము బొమ్మ రిలీజ్ చేసే టైమ్ కు పవన్ వీరమల్లు కూడా వస్తుందని తెలియడంతో షాక్ తింటున్నారు. థియేటర్ల షేరింగ్ తో పాటు కలెక్షన్లు కూడా చీలిపోతాయని లబోదిబో మంటున్నారు. పరిశ్రమ పెద్దలు గతంలో చెప్పినట్లు రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు  లేదా ఒకేవారం రిలీజ్ కాకూడదనే నియమాన్ని ఈ ఇద్దరు హీరోలు ఎంతవరకు తలకెక్కించుకుంటారో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: