అయితే ఈ కేసును ఛేదించేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్న ఎన్సీబీ ఇందుకు సంబంధించిన ఛార్జ్ షీట్ని ప్రిపేర్ చేసింది. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు తెలుసుకోవడానికి మొత్తం 200 మందిని విచారణ జరిపి ఈ చార్జిషీట్ ను ప్రిపేర్ చేసినట్లు సమాచారం. ఆ వివరాలతో పాటు.. 12 వేలకు పైగా పేజీలు ఉన్న చార్జిషీట్ ను కోర్టులో సబ్మిట్ చేసింది. ఇందులో సుశాంత్ మాజీ లవర్ అంకితా లోఖండే, రియా చక్రవర్తి, ఈమె సోదరుడు షోవిక్ చక్రవర్తి పేర్లు కీలకంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కేసు నిమిత్తం వీరిని ఇప్పటికే పలుమార్లు విచారించారు పోలీసులు.
త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. తమ అభిమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తమకు దూరం కావడంతో దిగ్భ్రాంతికి గురైన ఆయన అభిమానులు.... సుశాంత్ మరణానికి కారణమైన వారిని గుర్తించాలని అదే విధంగా వారికి కఠిన శిక్షలు పడాలి అంటూ ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం యావత్ భారతదేశాన్ని కంటతడి పెట్టించిన దివంగత యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఓవైపు ఆత్మహత్య మరోవైపు హత్య అన్న కేసులలో మును ముందు ఎలాంటి మలుపులు రానున్నాయి అన్నది తెలియాల్సి ఉంది.