బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా కల కలం రేపింది. ఈ ఉదంతం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజం, డ్రగ్స్‌ వినియోగం గురించి భారీ ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఇక డ్రగ్స్ విషయం  అయితే వైరల్ గా మారింది. దీంతో ఈ విషయ నిమిత్తం రంగంలోకి దిగింది మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం (ఎన్‌సీబీ). ఈ డ్రగ్స్ కేసులో మొదట ఏ1 గా నటి రియా చక్రవర్తి పేరు నమోదయింది. అదే విధంగా ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని కూడా ఈ డ్రగ్ కేసులో భాగం పంచుకున్నాడన్న ఆరోపణతో వీరిద్దరూ అరెస్టు కూడా అయ్యారు.

 అయితే ఈ కేసును ఛేదించేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్న ఎన్‌సీబీ ఇందుకు సంబంధించిన ఛార్జ్ షీట్‌ని ప్రిపేర్ చేసింది. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు తెలుసుకోవడానికి మొత్తం 200 మందిని విచారణ జరిపి ఈ చార్జిషీట్ ను ప్రిపేర్ చేసినట్లు సమాచారం. ఆ వివరాలతో పాటు.. 12 వేలకు పైగా పేజీలు ఉన్న చార్జిషీట్ ను కోర్టులో సబ్మిట్ చేసింది. ఇందులో సుశాంత్ మాజీ లవర్‌ అంకితా లోఖండే, రియా చక్రవర్తి, ఈమె సోదరుడు  షోవిక్‌ చక్రవర్తి పేర్లు కీలకంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కేసు నిమిత్తం వీరిని ఇప్పటికే పలుమార్లు విచారించారు పోలీసులు.

త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. తమ అభిమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తమకు దూరం కావడంతో దిగ్భ్రాంతికి గురైన  ఆయన అభిమానులు.... సుశాంత్ మరణానికి కారణమైన వారిని గుర్తించాలని అదే విధంగా వారికి కఠిన శిక్షలు పడాలి అంటూ ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం యావత్ భారతదేశాన్ని కంటతడి పెట్టించిన దివంగత యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఓవైపు  ఆత్మహత్య మరోవైపు హత్య అన్న కేసులలో మును ముందు ఎలాంటి మలుపులు రానున్నాయి అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: