ప్రస్తుతం 'అంధాధూన్' సినిమా రీమేక్ లో నటిస్తోన్న నితిన్.. తన తదుపరి చిత్రంగా 'పవర్ పేట' మొదలుపెడతారని అంతా అనుకున్నారు.ఇటీవల వక్కంతం వంశీ చెప్పిన కథ నితిన్ కి నచ్చడంతో ముందుగా వంశీ సినిమా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడట. 'నా పేరు సూర్య' సినిమా తరువాత వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తోన్న రెండో సినిమా ఇది. మొదటి సినిమా ప్లాప్ కావడంతో ఈసారి కథను మరింత పకడ్బందీగా రాసుకొని సినిమా మొదలుపెట్టబోతున్నాడు. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాకి ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.ఇక ఈ సినిమాతో నితిన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి