2020 సంవత్సరం నుండి ఇప్పటి వరకు సినీ పరిశ్రమకు కలిసి రాలేదని చెప్పాలి. గత సంవత్సరమంతా కరోనా కారణంగా సినీ పరిశ్రమ ధారుణంగా దెబ్బతింది. అంతే కాకుండా సినీ రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు మరణించారు. సినీ పరిశ్రమకు సంబంధించి ఈ సంవత్సరం అత్యధిక మరణాలు సంభవించడం జరిగింది. ప్రస్తుతం మరొక దిగ్గజ డైరెక్టర్ కన్నుమూశారు. ఈమె మరాఠీ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకురాలుగా పేరు గాంచింది. ఈ రోజున సుమిత్ర భవే పరమపదించారు. మాములుగా ఈమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. గత కొంత కాలంగా పుణెలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ రోజు ఉదయం పరిస్థితి మరింత విషమించడంతో చనిపోయారు. ఈమె మరాఠీ పరిశ్రమలో ప్రముఖ దర్శకురాలి గానే కాకుండా నిర్మాతగా కాకుండా పలు సినిమాలను నిర్మించి ఎంతో సేవ చేశారు. ఈమె పరిశ్రమకు వచ్చిన తరువాత మరాఠీ సినిమా పరిశ్రమలో ఎన్నో మార్పులను తీసుకువచ్చింది.  సుమిత్ర భవే ఎక్కువగా దర్శకుడు సునీల్ సుక్తాంకర్ తో కలిసి పని చేసింది. వీరిద్దరి కలయికలో మొత్తం 17 సినిమాలు రూపుదిద్దుకున్నాయి. సినిమాలకు రాక ముందుగా 50 కి పైగా షాట్ ఫిలిమ్స్ ని కూడా రూపొందించారు. మరాఠీలో నాలుగు టెలివిజన్ సీరియల్స్ ను కూడా తీయడం జరిగింది.

వీరిద్దరూ మరాఠీ సినిమా పరిశ్రమ అభివృద్ధికి చేసిన సేవలకు గానూ ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. 2016 సంవత్సరంలో వీరు తెరకెక్కించిన కాసవ్ అనే సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ లోటస్ నేషనల్ అవార్డును పొందడం జరిగింది. ఇంత ప్రతిభ కలిగిన సుమిత్ర భవే మరణించడంతో మరాఠీ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మరి కొంత మంది ఆప్తులు మరియు సన్నిహితులు ఈమె కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నారు. ఇవాళ సాయంత్రానికి అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: