ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఎన్నో అంచనాలతో దాదాపు 3 సంవత్సరాల తరువాత ఈ సినిమా రావడంతో ఓపెనింగ్స్ గట్టిగానే వచ్చాయి. కాని వసూళ్లు మాత్రం చాలా దారుణంగా వస్తున్నాయి. ఇక కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నుండి తెలంగాణలో థియేటర్లన్నింటినీ కూడా మూసివేశారు. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో 'వకీల్ సాబ్' సినిమాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ వారాంతం వరకు 'వకీల్ సాబ్'కు మినహాయింపు లభించింది. వచ్చే సోమవారం నుండి ఈ సినిమాను కూడా ఎత్తేస్తారు. అయితే కొంతమంది థియేటర్ యజమానులు 'వకీల్ సాబ్' సినిమాకు మినహాయింపు అక్కర్లేదని అంటున్నారు.


ఈరోజు నుండి 'వకీల్ సాబ్' సినిమాను ప్రదర్శిస్తోన్న కొన్ని థియేటర్లను కూడా మూసేస్తున్నారు. 'వకీల్ సాబ్' సినిమాకు గత వారం రోజులుగా సరైన ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. ఉగాది రోజు మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు.ఆ తరువాత మళ్లీ జనాలు కనిపించలేదు. దీంతో తమకు ఎలాంటి మినహాయింపులు వద్దంటూ ఈరోజు నుండి 'వకీల్ సాబ్' సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లను కూడా కొన్నింటిని మూసేస్తున్నారు. వీటిలో కొన్ని మల్టీప్లెక్స్ లు కూడా ఉన్నాయి.'వకీల్ సాబ్' సినిమాకు హైదరాబాద్ లో అత్తాపూర్ లో ఉన్న ఓ మల్టీప్లెక్స్ కి నిన్న కేవలం ఇరవై మంది ప్రేక్షకులు వచ్చారు. అలానే సిటీ సెంటర్ లో ఉన్న మరో మల్టీప్లెక్స్ కి పాతిక మంది ప్రేక్షకులు వస్తే.. షోని రద్దు చేసేసారు. ఇంత తక్కువ ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేస్తే కరెంట్ బిల్లులు కూడా కట్టలేమని అంటున్నారు యజమానులు. అయితే మెయిన్ ప్రజలు థియేటర్ లు రాకపోవడం కారణంగానే సినిమాని ఎత్తేస్తున్నారట. ఈ కరోనా మరీ ఎక్కువవడంతో ఈ సినిమాని ప్రజలు పట్టించుకోవట్లేదట...

మరింత సమాచారం తెలుసుకోండి: