టాలీవుడ్ లో హీరోలకే కాదు హీరోయిన్లు కూడా మంచి మార్కెట్ ఉంది.. స్టార్ హీరోలు ఉన్నా హీరోయిన్స్ కోసమే సినిమాలు చేసే కొంత మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు వాళ్ళకి.. కొన్ని ఇండస్ట్రీ లలో హీరోల కంటే ఎక్కువ క్రేజ్ హీరోయిన్లకే ఉందంటే నమ్మగలరా.. ఏదేమైనా సినిమాల్లో వారి పాత్ర కు ప్రాధాన్యం ఉన్నా లేకపోయినా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపారేయలేం.. ప్రస్తుతం తెలుగులో చాలామందికి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే మార్కెట్ ఏర్పడింది. అనుష్క, కాజల్ ,తమన్నా, శృతిహాసన్ ,పూజ హెగ్డే, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లే కాకుండా చిన్న తరహా ఈ రెండు కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు..

అలా ప్రస్తుతం భారీ బడ్జెట్తో నెలకొన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలో రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.. ఆ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈమె హీరోలతో నటించే సినిమాల కంటే లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించే సినిమాలే ఎక్కువ.. అలానే హీరో కూడా డిసప్పాయింట్ చేయట్లేదు.. వారితోనూ నటిస్తూ వారికి సమానంగా మార్కెట్ ను పెంచుకుంటుంది.. ఆమె నుంచి ప్రస్తుతం పలు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి వాటిలో నేత్రికన్ సినిమా ఒకటి.. ఈమధ్య టీజర్ విడుదలైన ఈ సినిమా ఎంత భయానకంగా ఉండబోతుందో టీజర్ ను బట్టి అర్థమవుతుంది..

ఇక కెరీర్ ఎండింగ్ దశకు వచ్చిన తరువాత కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.. ఇప్పటికే ఆమె పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమెకు ఈ రకమైన సినిమాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.. ప్రస్తుతం ఆమె నుంచి రంగి అనే సినిమా తెరకెక్కుతుంది.. లైకా ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా త్రిష కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది అంటున్నారు.. ఇక మహానటి తో లేడీ ఓరియెంటెడ్ సినిమాల లో మంచి క్రేజ్ తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆమె నుంచి ఇటీవల వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిరాశ పరిచిన ఆమెకు అవకాశాలు రావడం మాత్రం తగ్గట్లేదు. ఇష్టం గుడ్ లక్ సఖి అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: