ఒకప్పుడు టాలీవుడ్ టాప్ కమెడియన్ లలో వేణుమాధవ్ కూడా ఒకరు. ఈయన కమెడియనే కాకుండా మిమిక్రీ ఆర్టిస్టు కూడా. తనదైన కామెడీ సీన్లతో ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బ నవ్వించేవారు. వేణు మాధవ్ గారు సెప్టెంబర్ 25 న  2019 లో మరణించడం జరిగింది. ఈయన దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఇక ఈయన ఆస్తి ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం.

తెలుగు ఇండస్ట్రీలో తనదైన శైలిలో  ముద్రవేసుకుని అతి చిన్న వయసులోనే మరణించారు వేణుమాధవ్. ఈయన చనిపోయే ముందు ఆరోగ్యం బాగాలేదని  చెబుతుండేవారు.. కానీ చనిపోయేంతగా ఆరోగ్యం  బాగా లేదని ఎవరూ ఊహించలేకపోయారు. వేణుమాధవ్ చనిపోకముందు 6 సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు.

సినీ ఇండస్ట్రీలో  దూరంగా ఉన్న వేణుమాధవ్ ఆర్థిక ఇబ్బందులు చాలానే ఉన్నాయని అప్పట్లో వినిపించాయి. అయితే ఇవన్నీ నిజాలా.. కాదా!.. అనే విషయంపై ..వేణు మాధవ్ గారు మరణించిన కొద్ది గంటలకే.. ఆయన హాస్పిటల్ బిల్లును  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి  కట్టి , అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. అంతే కాకుండా వేరే హాస్పిటల్ లో కూడా వేణుమాధవ్ గారి బిల్లు ఈయనే కట్టారట.

అయితే ఈ విషయం తెలిసిన కొందరు అసలు వేణుమాధవ్ కి హాస్పిటల్ బిల్లు కట్టే అంత స్థోమత కూడా లేదు అని అనుకున్నారట.. అయితే  అంతకు ముందే వేణుమాధవ్ నీ ఆర్థిక  విషయంపై  ఒక ఇంటర్వ్యూలో అడగక.. ఆయన ఎలాంటి ఇబ్బందులు లేవని సమాధానం చెప్పారట. వేణుమాధవ్ గారికి అసలు ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పాడు. అంతేకాకుండా తనకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో  కూడా చెప్పుకొచ్చాడు.

ఈయనకి ECILనుంచి మౌలాలి వరకు మొత్తంగా తనకి పది సొంత ఇల్లు ఉన్నాయని అప్పట్లో తెలిపారు వేణుమాధవ్. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాలో వేణుమాధవ్ కు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. తనకు  ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు  లేవని కూడా తెలిపారు. పైగా వేణుమాధవ్ గారు చనిపోయిన తరువాత తన భార్య,కొడుకులు కూడా ఇంటర్వ్యూలో  మేము ఆర్థికంగా బాగానే ఉన్నాము అని చెప్పారు. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం వారి ఆస్తుల విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని తెలపడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: