ప్రముఖ సీనియర్ నటుడు, రాజకీయవేత్త మురళీ మోహన్ అందరికీ బాగా తెలుసు. ఈయన ప్రస్తుతం జరగబోయే మా ఎన్నికల పైన కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. ఈ ఎన్నికల గోల దాదాపుగా రెండు నెలల ముందు నుంచే కొనసాగుతూనే ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటిదాకా 5 మంది సినీ ప్రముఖులు మా ఎలక్షన్లలో పాల్గొంటున్నారు.

మురళీమోహన్ మాట్లాడుతూ..ఒకప్పుడు  మా ఎన్నికల పోటీ కి తక్కువ మెంబెర్స్ పోటీ చేసేవారు, అంతేకాకుండా అప్పట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అంటే చాలా పద్ధతిగా జరిగేవి.కానీ ఇప్పుడు అలా కాదు.. ఎవరు పడితే వారు, ఎవరికి నచ్చినట్టు వారు సభ్యత్వం తీసుకుంటున్నారు అంటూ మురళీమోహన్ చెప్పుకొచ్చారు.

అంతే కాదు పూర్వకాలంలో అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా ఎవరూ అధ్యక్షత వ్యవహరిస్తున్నారో కూడా తెలిసేది కాదు. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వస్తే బాగుంటుంది. పట్టాలు తప్పిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను తిరిగి సరైన ట్రాక్ మీదకు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఇలా ఒక పద్ధతి లేకుండా ఎవరు పడితే వారు సభ్యత్వం తీసుకున్న తరుణంలోనే, ఎవరిని కించపరచకుండా ఎటువంటి ఎన్నికలు లేకుండా, ఏకగ్రీవంగా అధ్యక్షుడిని పెంచుకోబోతున్నట్లు ఆయన ప్రకటించాడు.అంతే కాదు ఇలాంటి  ఏకగ్రీవ అధ్యక్ష పదవి కోసం ఒక మంచి ప్రత్యేకమైన కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు చూస్తున్నట్లు మురళీ మోహన్ తెలిపారు..  ప్రస్తుతం ఏర్పడుతున్న సరికొత్త విధానాలు మారాలని ,పూర్వపు విధానాలు వస్తే చాలా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక మోహన్ బాబు, చిరంజీవి ,జయసుధ, కృష్ణంరాజు వీళ్లంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందులో  మా ను కరెక్ట్ దారిలో వెళ్ళేలా  ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చాలామంది స్టార్ సెలబ్రిటీలు ఇందులో పోటీ పడుతున్న తరుణంలో, ఎన్నికలు పెడితే గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక అందరిని ఒప్పించి, ఏకగ్రీవంగా ఒకరిని మాత్రమే ఎంచుకోవాలని అనుకుంటున్నట్లు మురళీమోహన్ తెలిపారు. మా అధ్యక్ష పదవి అంటే ఇది కేవలం ఒక హోదా మాత్రమే అని చెప్పుకొచ్చారు. మా బరిలోకి దిగిన సభ్యులందరికీ ఏకగ్రీవం అనగానే, పోటీ చేస్తున్న వారందరికీ ఇది ఒక షాక్ న్యూస్ అని మాత్రం చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: