ప్రస్తుతం కరోనా వైరస్ కష్ట కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రెటీలు గొప్ప మనసు చాటుకున్నారు. కష్ట కాలంలో ఎంతోమంది పేద ప్రజలకు ఆహారం అందించడం లేదా బట్టలు అందించడం లాంటివి చేస్తున్నారు. అంతే కాకుండా ఇంకా ఎంతోమంది వినూత్నంగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక మరి కొంతమంది నటులు సమాజం కోసం ఏదో చేయాలని తపన పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని ట్రస్ట్ లు స్థాపించి వాటి ద్వారా సేవ చేయడానికి ముందుకొస్తారు. ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు ఇలా సమాజానికి సేవ చేయడం కోసం ఎన్నో చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే సేవ చేయడానికి సిద్ధమైంది.


 ఇటీవలే ఆల్ అబౌట్ లవ్ అనే ఫౌండేషన్ ను ప్రారంభించింది పూజా.  ఇక ఈ ఫౌండేషన్ ద్వారా తనకు చేతనైనంత సహాయం చేసేందుకు సిద్ధమయ్యా అంటూ ఇటీవల చెప్పుకొచ్చారు. సమాజం మనకు ఎంతో ఇచ్చినప్పుడు మనం కూడా కొంత అయినా తిరిగి ఇవ్వాలి కదా అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. అయితే తనను ఈ స్థాయికి తీసుకు వచ్చి ఇక ఒకరికి సేవ చేసేందుకు శక్తి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ చెప్పింది పూజ హెగ్డే.



 ప్రేమ అనేది ఎంతో శక్తివంతమైనది అందుకే ఇక సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని తాను నిర్ణయించుకున్నాను అంటూ తెలిపింది. అందుకే ఆల్ అబౌట్ లవ్ అనే పౌండేషన్ ప్రారంభించాను అంటూ పూజా హెగ్డే తెలిపింది. ప్రేమతో చేసే ఒక చిన్న పని అయినా ప్రపంచంలో మార్పుకు కారణం అవుతుంది అంటూ పూజ హెగ్డే తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజా హెగ్డే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాతో పాటు ఇక చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో చరణ్ సరసన కూడా నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలపై ప్రస్తుతం భారీ రేంజ్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: