టాలీవుడ్ ఇండస్ట్రీలో భల్లాలదేవుడు దగ్గుబాటి రానాకి అంటూ ఒక బ్రాండ్ ఉంది. ప్రత్యేకమైన కథలను ఎంపిక చేసుకుంటూ వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతను ఎంచుకునే ప్రతి కథలోనూ తన పాత్ర ఎంతో బిన్నంగా ఉంటుంది. తన ప్రతి పాత్రలోనూ వ్యత్యాసం చూపుతూ కొత్తదనాన్ని కనబరచడంలో రానా ది గ్రేట్ అని టక్కున చెప్పేయొచ్చు. అయితే తన తనయుడు రానా గురించి అలాగే తన ముద్దుల రెండవ కుమారుడు అభిరామ్ గురించి తాజాగా మీడియాతో ముచ్చటించారు దగ్గుబాటి సురేష్ బాబు. ఇటీవల నారప్ప ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ రానా గురించి కొన్ని కీలక అంశాలను బయట పెట్టారు.

రానా గురించి ఆయన మాటల్లో..రానా ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ప్రతి విషయంలోనూ ప్రత్యేకతను వెతుకుతాడు,అందరిలో  ప్రత్యేకంగా ఉండాలని ఆశిస్తాడు. అందుకే తన సినిమాలు , తన పాత్రలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి అన్నారు. ఇక సినిమాల కథల విషయంలో అసలు ఎవరి మాటా వినడని, తన మనసుకు నచ్చితే తప్ప, ప్రత్యేకంగా అనిపిస్తే తప్ప అస్సలు కన్విన్స్ కాడని పేర్కొన్నారు దగ్గుబాటి సురేష్. కెరియర్ ఆరంభం అయిన నాటి నుండి నేటి వరకు వైవిధ్యభరితమైనటువంటి కథలు, పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న నటుడు రానా అని ఆయన అన్నారు.

పాత్ర తన మనసుకు నచ్చితే చాలు ప్రాణం పెట్టేస్తాడు. ఎంత కష్టమైనా ఆ పాత్ర కోసం ఇష్టంగా కష్టపడతారు.  ఇందుకు బాహుబలి సినిమాలో రానా పోషించిన బల్లాల దేవుడి పాత్రే నిదర్శనంగా చెప్పొచ్చు.  అంతే కాకుండా ఈ పాత్ర కోసం అధిక బరువు పెరిగిన రానా వెంటనే అరణ్య చిత్రం కోసం దాదాపు 30 కేజీలు బరువు తగ్గాడు. అంతగా పాత్రల విషయంలో శ్రద్ధ వహిస్తారు రానా. ఆ కథ బాగుంది, ఈ కథ హిట్ అవుతుంది అన్నా వినడు. కాన్సెప్ట్ ల గురించి తనకో క్లారిటీ ఉంది. దాని ప్రకారమే నడుచుకుంటారు తప్ప ఎవరూ చెప్పినా వినడు అంటూ, తన కన్న కలను నెరవేర్చడానికి మాకు వీలైనంత సహాయం చేస్తాం అంతే అంటూ రానా గురించి చెప్పుకొచ్చారు సురేష్ బాబు. అలాగే  తన రెండవ తనయుడు కూడా త్వరలో ఒక విభిన్న మైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు నిర్మాత సురేష్ బాబు..

మరింత సమాచారం తెలుసుకోండి: