మాస్ మహరాజ్ రవితేజ మళ్లీ తన సినిమాల వేగాన్ని పెంచాడు. క్రాక్ సినిమా హ్నిట్ తో కెరియర్ లో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసిన రవితేజ తన నెక్స్ట్ సినిమా ఖిలాడితో కూడా ఆ ఫాం కొనసాగించాలని చూస్తున్నాడు. రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఖిలాడి సినిమాలో మాస్ రాజా డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత శరత్ మండవ అనే నూతన దర్శకుడితో రామారావు సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాలో సబ్ కలక్టర్ గా రవితేజ నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ తర్వాత నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో ఓ సినిమా ఉందని తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత సూపర్ హిట్ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నాడు రవితేజ. మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను, రవితేజ తో ఓ సినిమా తీసే ప్లాన్ లో ఉన్నారట. బోయపాటి మొదటి సినిమా భద్రతో హిట్ అందుకున్నా ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతుంది. భద్రతో హిట్ అందుకున్న ఈ ఇద్దరు మరోసారి కలిసి సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ లీడ్ రోల్ లో అఖండ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ హీరోతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక ఆ తర్వాత మాత్రం రవితేజ హీరోగా సినిమా ఉంటుందని అంటున్నారు. రవితేజ, బోయపాటి కాంబో సెకండ్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ తో పాటుగా మిగతా డీటైల్స్ కూడా త్వరలో వస్తాయని తెలుస్తుంది. నక్కిన త్రినాథ రావు, బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమాలను రెండు ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట రవితేజ.  కెరియర్ లో దూకుడు చూపిస్తున్న రవితేజ తన సత్తా చాటేలా ఉన్నాడని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: