తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప సింగర్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న సునీత కు సంబంధించిన వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చేస్తూ ఉంటాయ్. అయితే ఇక ఆమెపై ఎన్ని రకాల వార్తలు హల్చల్ చేసినప్పటికీ ఆ వార్తలపై స్పందించేది కాదు. కానీ పెళ్లి తర్వాత మాత్రం ఇక అన్ని విషయాలను మీడియాతో పంచుకుంటూ వస్తుంది సునీత. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ కి హాజరైన సునీత తన పర్సనల్ లైఫ్ లో ఎదురైన కొన్ని అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.



 ఒకానొక సమయంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ భార్య కారణంగా తాను ఎంతో అవమాన పడ్డాను అంటూ సునీత  ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక పాట పాడాల్సి ఉన్న సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియో కి పిలిచారు. ఈ క్రమంలోనే పాట పాడేందుకు ఆ డైరెక్టర్ తన చేతిలో ఉన్న మైక్ ఇచ్చారు. ఇక ఆ మైక్ తీసుకున్న నేను పాట పాడి స్టూడియో నుంచి బయటకు వచ్చి ఆ మైక్ అక్కడ టేబుల్ పైన పెట్టాను. కానీ ఇదంతా ఎంతో సేపటినుంచి ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య గమనిస్తూ వచ్చింది. ఇక నేను స్టూడియో నుంచి బయటకు రాగానే తన దగ్గరకు వచ్చి నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అని గట్టిగా అరిచింది.



 నేనేం చేశాను అంటూ ఆవిడని నేను అడిగాను. నువ్వు మైక్ తీసుకునే సమయంలో నీ చేతి వేళ్ళు మా ఆయన చేతికి తగిలాయి. అలా నీ చేతి వేళ్లను మా ఆయనకు తగిలించడం వెనుక నీ ఉద్దేశం ఏమిటి అంటూ అందరి ముందు దారుణంగా ఆమె నన్ను అవమానించింది అంటూ సింగర్ సునీత చెప్పుకొచ్చింది. ఇక ఆ సమయంలో ఎంతో కోపం వచ్చిందని ఇక నా స్టైల్ లోనే సమాధానం చెప్పాను అంటూ తెలిపింది. కానీ ఆ ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందని ఒక రకమైన ఫీలింగ్ తెచ్చింది అంటూ  తన చేదు అనుభవాన్ని అభిమానులతో  పంచుకుంది. తన జీవితంలో  ఇలాంటివి  ఎన్నో జరిగాయి.ఎంతో మంది కొట్టాల్సింది. కానీ తన స్వభావం  కారణంగా కొట్టకుండా వదిలేసాను. కేవలం తిట్టడంతో సరిపెట్టుకున్నా అంటూ సింగర్ సునీత తెలిపింది .

మరింత సమాచారం తెలుసుకోండి: