నభా నటేశ్ సినిమా ఇండస్ట్రీలో విచిత్రమైన అనుభూతి పొందుతోంది. సినిమా అవకాశాలైతే వస్తున్నాయి. నటించిన సినిమాలు సైతం మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. కానీ ఆ అమ్మడికి మాత్రం పేరు రావడం లేదు. ఇదే ఆమెను చాలా కుంగదీస్తోంది. ఎందుకిలా జరుగుతోందని లోలోన మదనపడిపోతోంది. ఇలా కాకూడదని ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా.. జరిగేది జరిగిపోతోంది.

ఫ్లాపులతో కెరీర్‌కి బ్రేకులు పడ్డాయి అంటే ఇండస్ట్రీలో కామన్ అనుకోవచ్చు. కానీ సక్సెస్ వచ్చినా పేరు రాకపోతే ఎలా ఉంటుంది.. బ్లాక్‌బస్టర్‌లో హీరోయిన్‌కి పెద్దగా భాగస్వామ్యం లేకపోతే ఇండస్ట్రీ జనాలు కూడా పెద్దగా పట్టించుకోరు. నభా నటేశ్ కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. 'ఇస్మార్ట్ శంకర్' హిట్ అయ్యాక నభా నటేశ్‌కి వరుస సినిమాలు వచ్చాయి. యంగ్‌స్టర్స్‌తో పాటు సీనియర్ స్టార్స్‌తోనూ సినిమాలు చేసింది. 'డిస్కోరాజా'లో రవితేజతో కలిసి స్టెప్పులేసింది. అయితే ఈ సినిమా ఆడియన్స్‌కి పెద్దగా కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో చేసిన 'అల్లుడు అదుర్స్' అయితే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

నభా నటేశ్ ఫ్లాపుల నుంచి బయటపడటానికి 'మాస్ట్రో'నే నమ్ముకుంది. 'అంధాదున్' రీమేక్‌గా వస్తోన్న ఈ మూవీతో మళ్లీ బిజీ కావాలని ఆశ పడింది. నభా ఆశలకు తగ్గట్లుగానే 'మాస్ట్రో' కూడా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్నాయి. అయితే ఈ రివ్యూస్‌లో అంతా నితిన్, తమన్నా గురించే మాట్లాడుతున్నారు. నభా గురించి పెద్దగా ప్రశంసలు కూడా రాలేదు.

'మాస్ట్రో'లో తమన్నా నెగటివ్ పాత్ర పోషించింది. హీరోని డామినేట్ చేసే క్యారెక్టర్‌తో ప్రశంసలు అందుకుంటోంది. మిల్కీ హీరోయిన్‌గానే కాదు, విలన్‌గానూ అదరగొట్టిందని కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయి. కానీ నభా నటేశ్ పెర్ఫామెన్స్ గురించి ఎక్కడా చర్చలు జరగట్లేదు. దీంతో సక్సెస్‌లో మేజర్‌ క్రెడిట్‌ తమన్నాకే వెళ్లిపోయిందని ఫీలవుతోందట నభా నటేశ్. మరి రాబోయే సినిమాల్లో అయినా ఈ బ్యూటీ క్రేజ్ సంపాదించుకుంటుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: