కరోనా తర్వాత థియేటర్ లో సినిమాను విడుదల చేయాలంటే దర్శక నిర్మాతలు ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని అటు ఓటీటీ ప్లాట్ ఫాం లో విడుదల చేయలేక, జనం సరిగా రాని థియేటర్ లోనూ విడుదల చేయలేక సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైవ్ స్టోరీ మూవీ అనేక వాయిదాల తర్వాత ఈ రోజు థియేటర్ లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు తమ బెస్ట్ విషెస్ ను లవ్ స్టొరీ టీమ్ కు అందిస్తున్నారు.

ప్రభాస్ కూడా లవ్ స్టోరీ సినిమా బృందానికి విషెస్ తెలిపారు. సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న అన్ని సినిమాలు సక్సెస్ సాధించాలని ఈ సందర్భంగా డార్లింగ్ కోరుకున్నారు. ప్రేక్షకులు అంతా సినిమాను థియేటర్ లోనే చూడాలని రిక్వెస్ట్  చేశారు.

ప్రముఖ తమిళ హీరో ధనుష్ సరసన నిన్న ట్విట్టర్ వేదికగా లైవ్ స్టోరీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని ధనుష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల ధనుష్ తో ఒక సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.

హీరోయిన్ కీర్తి సురేష్ సైతం లవ్ స్టోరీ టీమ్ కు తన విషెస్ ను తెలిపింది. ముఖ్యంగా సాయి పల్లవి మరియు నాగ చైతన్య లకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అందరితో పాటుగా నేను కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని కీర్తి సురేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

డైరెక్టర్ సురేందర్ రెడ్డిసినిమా గురించి చెబుతూ ఈ సినిమా ఒక మంచి ప్రేమ కథతో వస్తోంది. ఇన్ని రోజుల నిరీక్షణకు ఈ రోజు తెరపడనుంది అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా టీమ్ మొత్తానికి తన విషెస్ చెప్పారు.

సుశాంత్ అక్కినేని కూడా ట్విట్టర్ లో నాగ చైతన్య ను ఉద్దేశించి ఈ సినిమా థియేటర్ లో విడుదల అయి పెద్ద విజయం సాధించి మరి కొన్ని సినిమాలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

డైరెక్టర్ బాబీ ట్విట్టర్ ద్వారా లవ్ స్టోరీ సినిమా నుండి వచ్చిన టీజర్ సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై ఎంతో క్రేజ్ ను పెంచాయని, ఈ సినిమా టీమ్ అందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ప్రేక్షకులను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు. దయచేసి ప్రతిఒక్కరు థియేటర్ కు వెళ్లి సినిమాను చూసి ఆదరించాలి అని కోరుకున్నారు.

ఈ రోజు ఈ సినిమా రిలీజ్ తో హీరో విజయ్ దేవరకొండ థియేటర్ ఏవీడీ సినిమా ఓపెన్ కానుంది. ఇందులో మొత్తం మూడు స్క్రీన్స్ ఉండనున్నాయి. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ తన విషెస్ తెలిపారు.

ఇక మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాను థియేటర్ లోనే చూడాలని ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరాడు. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఇలా ఈ సినిమాలో నటించిన నాగ చైతన్య మరియు సాయి పల్లవి ల స్నేహితులు అందరూ ఈ సినిమా సక్సెస్ కావాలని విషెస్ తెలియచేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలను నిలబెట్టుకుంటూ తెలియాలంటే ఇంకాసేపు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: