టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో దేవీ శ్రీ ప్రసాద్ కు ఆయన సంగీతానికి కి ఉన్న క్రేజ్ వేరే. రెండు దశాబ్దాలుగా ఆయన మంచి సంగీతం అందిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అందరూ హీరో లు కూడా తప్పకుండా దేవి శ్రీ ప్రసాద్ తో పని చేయాలని కోరుకునే వారే. ఏ హీరో అభిమానులకు తగ్గ సంగీతాన్ని ఆ హీరోకు అందిస్తూ అందరి హీరోల అభిమానాన్ని కూడగట్టుకొని ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ సంగీత దర్శకుడి గా ఎదిగాడు దేవి శ్రీ ప్రసాద్.

టాలీవుడ్ లో నెంబర్ వన్ దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడని చెప్పవచ్చు. ఆయనకు తమన్ మంచి పోటీ ఇచ్చినా కూడా దేవి శ్రీ ప్రసాద్ తనదైన సంగీతంతో ప్రేక్షకులలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకు పోతున్నాడు. మెలోడీ సంగీతాన్ని అందించడంలో దేవిశ్రీప్రసాద్ కు తిరుగులేదు అని అనడానికి ఎన్ని పాటలే సమాధానం. తాజాగా తన పాటలలో ఏమాత్రం సత్తా తగ్గలేదు ముఖ్యంగా మెలోడీ పాటల విషయం లో అంత కంతకు ప్రేక్షకులను మెప్పించే పాటలే ఇస్తున్నాడు అని చెప్పడానికి మరొక ఉదాహరణ పుష్ప సినిమాలో ఇటీవలే విడుదలైన శ్రీవల్లి అనే పాట.

పుష్ప సినిమా 5 భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా ఐదు భాషలకు గానూ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. కాగా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెలోడీ పాటగా హీరోయిన్ పేరు తో ఈ సినిమా పాట ఇది ప్రేక్షకులను భారీగా అలరిస్తుంది. సిడ్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట లో అల్లు అర్జున్ వేసిన స్టెప్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది అని చెప్పవచ్చు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17 వ తేదీన ఈ చిత్రం యొక్క మొదటి భాగం విడుదల అవుతుండగా అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: