సిని సెలబ్రిటీల గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ కొత్త విషయాల కోసం వెతకడం చేస్తుంటారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు వాడే కార్లు వేసుకునే దుస్తులు ఇక ఉపయోగించే వస్తువులు అన్నిటిని గురించి తెలుసుకుంటారు. ఇక ఎవరైనా సెలబ్రిటీలు కాస్త కాస్ట్లీ వస్తువులు వాడారు అంటే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. సాధారణంగా సినీ సెలబ్రిటీలు సొంత ఇంట్లో ఉంటున్నప్పటికీ తమకు నచ్చిన విధంగా సరి కొత్త ఇంటిని కొనుగోలు చేయడం లేదా కట్టుకోవడం లాంటివి చేయడం చేస్తూ ఉంటారు. దీని కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా వెనకాడరు.


 ఇలా భారీ మొత్తంలో ఖర్చు చేసి సినీ సెలబ్రిటీలు కొనుగోలు చేసే ఇల్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇక పోతే ఇప్పుడు బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ కొత్త ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అక్షయ్ కుమార్. ఇప్పటికే ఈ హీరో చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇక ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేస్తున్నాడు అక్షయ్ కుమార్. ఇకపోతే ఇటీవల కోట్ల రూపాయలు వెచ్చించి ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ను అక్షయ్  కుమార్ కొనుగోలు చేశాడట.


 దీనికి సంబంధించిన వార్త బాలీవుడ్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ముంబై లోని కర్ వెస్ట్ లో ఓ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశాడట అక్షయ్ కుమార్. దాదాపు 1878 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారట. 19వ ఫ్లోర్లో ఈ అపార్ట్మెంట్ వుంటుందట. ఇక ఈ అపార్ట్మెంట్ యొక్క ధర 7.8 కోట్ల రూపాయలు అన్నది తెలుస్తుంది. దీనికి సంబంధించి జనవరి 7వ తేదీన కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందట. కాగా ప్రస్తుతం ఈ స్టార్ హీరో జూహు లోని డూప్లెక్స్ భవంతి లో ఉంటున్నాడు. ఇక ఇప్పుడు మరో ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: