టాలీవుడ్ దర్శకుడు దర్శకుడు రమేష్ వర్మ తీసిన రాక్షసుడు సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. తమిళ సినిమా రటసన్ కి ఈ సినిమా రీమేక్. ఇక ఈ సినిమా తరువాత రవి తేజాతో ఖిలాడీ సినిమాతో ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్లాప్ అయ్యి జనాలను నిరాశ పరిచైనా కానీ విమర్శకులను మాత్రం కొంచెం బాగానే ఆకట్టుకొంది. ఊహాజనిత స్క్రీన్‌ప్లే ఇంకా అనూహ్యమైన దర్శకత్వంలాగా విమర్శకులకు అనిపించింది. అందువల్ల దర్శకుడికి విమర్శకుల నుంచి కొంచెం బాగానే మంచి మార్కులే పడ్డాయి.అయితే రాక్షసుడు లాంటి మంచి థ్రిల్లింగ్ సక్సెస్ తర్వాత ఖిలాడీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ అది అసలు నిలదొక్కుకోలేకపోయింది.ఇదిలా ఉంటే రమేష్ వర్మ మాట్లాడుతూ ఖిలాడీ సాధారణ ప్రేక్షకులకు బాగా చేరువయ్యిందని అందుకే బాగా ఎంజాయ్ చేస్తున్నామని అన్నారు. సినిమా నిర్మాత కోనేరు సత్యనారాయణ తనతో చాలా సంతోషంగా ఉన్నారని అందుకే తనకు రూ.100 కోట్ల ప్రాజెక్ట్ ని కూడా ఆఫర్ చేశారన్నారు. ప్రస్తుతం తాను ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నట్లు రమేష్ వర్మ తెలిపారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ తో తదుపరి చిత్రం చేయనున్నట్టు నిర్మాత కోనేరు సత్యనారాయణ గతంలోనే ధృవీకరించడం జరిగింది.ఇక ఈ దర్శకుడి ఈ ప్రకటనతో, ఖిలాడీ కాంబో త్వరలో పవన్ కళ్యాణ్‌తో భారీ బడ్జెట్ సినిమా కోసం జతకట్టనున్నట్లు కనిపిస్తోంది.ఖిలాడి సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి ఇంకా మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా ఇంకా రమేష్ వర్మ రచనతో పాటు దర్శకత్వం కూడా చేశాడు.కానీ ఈ సినిమా నెగటివ్ టాక్ తో ప్రేక్షకులను సరిగ్గా మెప్పించలేక ప్లాప్ సినిమాగా నిలిచింది. ఇక కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి చాలా దారుణంగా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: