కరోనా సమయంలో ప్రజలంతా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో బాలీవుడ్ నుండి వచ్చి అందరికీ అండగా నిలిచి నేనున్నా అంటూ ఎందరికో తన ఆపన్న హస్తాన్ని అందించాడు. సోనూ సూద్ స్వయంగా ఒక మినీ గవర్నమెంట్ నే నడిపాడంటే నమ్మగలరా? అవును అండీ ఇది నిజం కరోనా సోకి లక్షల మంది హాస్పిటల్ లో బెడ్స్ దొరక్క బాధ పడుతుంటే బెడ్స్ దొరికేలా చేశాడు. కరోనాకు సంబంధించిన మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్ లు అందుబాటులో లేకపోతే తానే స్వయంగా ఏర్పాటు చేసి లక్షల మంది ప్రాణాలను నిలబెట్టాడు. ఇలా ఒక్కటేమిటి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసి భారతదేశ ప్రజల గుండెల్లో ఒక మంచి మనసున్న దేవుడిగా ఆరాధించబడ్డాడు.

ఇతను చేసే సహాయాలు ముందు భారత ప్రభుత్వం ఏ పాటిది అని సామాన్యుడు ఆలోచించేలా చేశాడు. అయితే అలాంటి సోనూ సూద్ గత మూడు రోజుల నుండి ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా పంజాబ్ లో సోనూ పై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అయితే ఏమి జరిగింది అంటే సోనూ సూద్ చెల్లెలు మాళవికా సూద్ పంజాబ్ లో జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున మోగా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే గా పోటీ చేస్తోంది. ఇందు కోసం సోనూసూద్ ప్రచార బాధ్యతలను ఎత్తుకున్నాడు. అయితే ప్రచారం అంటే పోలింగ్ రోజు ముందు వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.

కానీ సోనూ సూద్ ఎలక్షన్స్ రోజు అంటే ఆదివారం కూడా ప్రచారం చేయడంతో ఎన్నికల ఉల్లంఘన కింద ఇతనిపై మోగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 199 కింద కేసు నమోదు చేశారు. దీనితో దేశ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవును ఎన్నికల ఉల్లంఘనే అయినా ఒక వార్నింగ్ ఇస్తే సరిపోతుంది కదా? కేసు నమోదు చేయడం ఎందుకు అంటూ వాపోతున్నారు. మరి ఈ విషయం ఎక్కడికి దారి తీస్తుందో అని అంతా బాధపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: