తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ ,మహేష్ బాబు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ప్రభాస్ నుంచి రాధే శ్యామ్ విడుదలయింది. ఇక మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గత కొన్ని సినిమాలలో ఒకే రోల్స్ కే పరిమితమైన మహేష్ బాబు ఈసారి ఒక మాస్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. దీంతో ఈ క్యారెక్టర్ లో మహేష్ బాబు మెప్పించారు. ఈ చిత్రానికి దర్శకుడుగా పరశురామ్ వహించారు.

ఇక ఈ చిత్రం ఓపెనింగ్ కూడా మంచిగానే రాబట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదంతా ఇలా ఉండగా సర్కార్ వాటి పాట చిత్రాన్ని హీరో ప్రభాస్ నిన్నటి రోజున సాయంత్రం చూసినట్లుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారుతోంది. సర్కారు వారి పాట సినిమా ప్రభాస్ కు బాగా నచ్చిందని తెలియజేసినట్లు గా సమాచారం ఇక ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ కూడా బాగా నచ్చాయని వాటిని చూస్తూ బాగా ఎంజాయ్ చేశానని ప్రభాస్ తన స్నేహితులతో చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో మాత్రం నిజం ఎంత ఉందో తెలియదు కానీ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రాన్ని చూడడంతో ఇద్దరు ఫ్యాన్స్ చాలా కుషి అవుతున్నారు. ఇక గతంలో కూడా ప్రభాస్ నటించిన వర్షం సినిమా ఆడియో ఫంక్షన్ కు మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా వచ్చారు ఆ తర్వాత అనేక సందర్భాలలో వీరిద్దరూ ఒకే వేదిక మీద కనిపిం చడం జరిగింది. ఇక అభిమానులు సైతం ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజులలో అభిమానుల కోరిక తీరుస్తారా ఏమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: