ఈ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీలో అయినా ఎక్కువగా ప్రేమ వివాహలే ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా యువ హీరో ఆది పినిశెట్టి కన్నడ హీరోయిన్ అయిన నిక్కీ గల్రానీ తో గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్చి 24న ఇరు కుటుంబాల సమక్షంలో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఈ నెల 18న చెన్నైలో వీరిద్దరూ కలిసి వివాహం చేసుకోబోతున్నట్లు గా సమాచారం అందుతోంది. అయితే ఈ వివాహానికి అతిధి గా సూపర్ స్టార్ రాబోతున్నట్లు గా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.

ఆది పినిశెట్టి-నిక్కి తమ వివాహ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన ఈ జంట తమ వివాహ వేడుకలకు సంబంధించి కొన్ని విషయాలపై ప్రెస్మీట్ పెట్టి తెలియజేసింది. తమ వివాహానికి కేవలం తమ కుటుంబ సభ్యులు, తమ స్నేహితులు, సినీ పరిశ్రమలో ఉండే స్నేహితులకు మాత్రమే ఆహ్వానం అందించాము. చాలా తక్కువ మంది సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరగనుంది.. కానీ మీ అందరి ఆశీర్వాదాలు దీవెనలు మాకు కావాలి కనుక ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

ఇక ఈ వివాహానికి వచ్చే అతిథుల గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా ఆది పినిశెట్టి స్టార్ హీరో అజిత్ ను కలిసి ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. హైదరాబాద్ కు వెళ్లి మళ్లీ అజిత్ ను కలవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇలాంటి నేపథ్యంలో రేపు తమ వివాహానికి అజిత్ ఆహ్వానించేందుకు ఆది వెళ్ళాడు అన్నట్లుగా తెలుస్తోంది. ఆది మొదట గుండెల్లో గోదావరి వంటి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా , పలు ముఖ్య పాత్రల్లో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: