ఆది పినిశెట్టి-నిక్కి తమ వివాహ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన ఈ జంట తమ వివాహ వేడుకలకు సంబంధించి కొన్ని విషయాలపై ప్రెస్మీట్ పెట్టి తెలియజేసింది. తమ వివాహానికి కేవలం తమ కుటుంబ సభ్యులు, తమ స్నేహితులు, సినీ పరిశ్రమలో ఉండే స్నేహితులకు మాత్రమే ఆహ్వానం అందించాము. చాలా తక్కువ మంది సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరగనుంది.. కానీ మీ అందరి ఆశీర్వాదాలు దీవెనలు మాకు కావాలి కనుక ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
ఇక ఈ వివాహానికి వచ్చే అతిథుల గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా ఆది పినిశెట్టి స్టార్ హీరో అజిత్ ను కలిసి ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. హైదరాబాద్ కు వెళ్లి మళ్లీ అజిత్ ను కలవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇలాంటి నేపథ్యంలో రేపు తమ వివాహానికి అజిత్ ఆహ్వానించేందుకు ఆది వెళ్ళాడు అన్నట్లుగా తెలుస్తోంది. ఆది మొదట గుండెల్లో గోదావరి వంటి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా , పలు ముఖ్య పాత్రల్లో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందారు.