తమిళ నటుడు సముద్రఖని తెలుగులోనూ బాగా పాపులర్ అయ్యాడు. తన విలక్షణమైన నటనతో వరుస అవకాశాలను అందుకుంటున్నారు. "అలా వైకుంఠ పురంలో" చిత్రంతో విలన్ గా మంచి గుర్తింపును పొందారు. ఈయన ప్రత్యేకమైన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈయన మంచి నటుడే కాదు గొప్ప దర్శకుడు కూడా. ఇటు తెలుగులోను అటు తమిళ్ లోనూ రెండింటిలోను టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు సముద్రఖని. తాజాగా సర్కారు వారి పాట చిత్రం లో విలన్ గా నటించి మరోసారి తన సత్తాను చాటారు. ఈ సినిమాలో విభిన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ నటుడు. ఈ చిత్రంలో ఎంపీ రాజేంద్రనాథ్ పాత్రలో ఆకట్టుకున్నారు.

సినిమా కూడా మంచి విజయం సాధించడంతో అది మరింత ప్లస్ అయ్యింది. అయితే తాజాగా ఈ సందర్భంగా మాట్లాడిన నటుడు సముద్రఖని హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన నటుడు సముద్రఖని ముందుగా సర్కారు వారి పాట సినిమా గురించి చెబుతూ ప్రశంసలు కురిపించారు. అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తారక్ గొప్ప నటుడే కాడు మంచి రాజకీయ విశ్లేషకుడు కూడా అంటూ ప్రసంశలు కురిపించారు.  తాజాగా ఓ ఇంటర్వ్యుల్లో సముద్రఖని మాట్లాడుతూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

తారక్ లో అద్భుతమైన టాలెంట్ ఉంది. అంతేకాదు చాలా చురుకైన వ్యక్తి కూడా. సినిమాలో ఎంత బాగా నటిస్తాడో.. అంతకన్నా ఎక్కువగానే రాజకీయలపై మంచి పట్టు కూడా ఉంది. తారక్ కి రాజకీయ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉండనే చెప్పాలి. నేను తారక్ అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటాం. ఎపుడు కలిసినా తారక్ నేను చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఒకసారి పాలిటిక్స్ గురించి చర్చిస్తున్న సమయంలో తారక్ మాట్లాడిన మాటలు చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. తారక్ కి పాలిటిక్స్ పట్ల నాలెడ్జ్ ఉందా అనిపించింది. ఎన్నికలకు ముందే  తమిళనాడులో డీఎంకే పార్టీనే ఖచ్చితంగా వస్తుందని తారక్ ఎప్పుడో చెప్పేశాడు.. చివరికి తారక్ అన్నట్లుగానే జరిగింది. రిజల్ట్ వచ్చాక మళ్ళి మేము కలిస్తే నేను చెప్పిందే జరిగింది చూశావా అంటూ మళ్ళీ అన్నాడు. ఎన్టీఆర్ తో మాట్లాడేటప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి, అసలు టైం అన్నదే తెలియదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు నటుడు సముద్రఖని.


మరింత సమాచారం తెలుసుకోండి: