టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తాజాగా సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)సినిమాతో తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ఇక పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12న విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ సూపర్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈసినిమా వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు నటించే తరువాతి సినిమా గురించి హాట్ డిస్కషన్ నడుస్తుంది ఫిలిం సర్కిల్స్ లో మహేష్ తన నెక్స్ట్ మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఆతర్వాత మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో కూడా సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి నిత్యం ఫిలింసర్కిల్స్ లో ఏదో ఒక వార్త ఎప్పుడు చక్కర్లు కొడుతూనే ఉంటాయి.తాజాగా మహేష్ ఇంకా అలాగే రాజమౌళి సినిమాకు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. 


మహేష్ కోసం జక్కన్న రెండు అదిరిపోయే కథలను సిద్ధం చేశారట. జక్కన్న రెండు స్క్రిప్ట్ లను రెడీ చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు తో చివరి దశ చర్చల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇటీవలే మహేష్ బాబు తన ఫ్యామిలీతో వెకేషన్ కు విదేశాలు వెళ్లారు.ఆయన తిరిగి వచ్చిన వెంటనే ఈ రెండు కథలను మహేష్ బాబుకు వినిపించనున్నారట.. మహేష్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కూడా మొదలు పెట్టేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే యస్ యస్ రాజమౌళి టీమ్ మహేష్ బాబు సినిమా కోసం లొకేషన్ల వేటని కూడా మొదలు పెట్టారట. మహేష్ బాబు కథను లాక్ చేయగానే ఏమాత్రం కూడా ఆలస్యం లేకుండా సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నారట జక్కన్న రాజమౌళి. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాని కూడా వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: