ప్రభాస్ పాన్
ఇండియా స్టార్ గా మారిన తరువాత ఆయన సినిమాలు చేసే సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఈ
హీరో మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
సినిమా ఫలితం ఏవిధంగా ఉన్నా కూడా పట్టించుకోకుండా వరుస సినిమాలు చేయడమే ఆయన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి.
వాటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు
ఆది పురుష్
సినిమా ను విడుదల చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆ
సినిమా రాబోతుంది. ఆ తరువాత సలార్ సినిమాను విడుదల చేయబో తున్నాడు.. ఆ తర్వాత
మారుతి సినిమా ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే
మారుతి దర్శకత్వంలో
సినిమా మొదలు పెట్ట వలసి ఉంది. కానీ ఆలస్యం ఆవుతుంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం అందించబోయే
సినిమా సైతం ఆ చిత్రం యొక్క షూటింగ్ కూడా ఈ ఏడాది పూర్తి చేయాలని
ప్రభాస్ భావిస్తున్నారు. ఆ విధంగా ఈ సినిమాలన్నీ పూర్తి చేసిన తరువాత వచ్చే ఏడాది
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్
సినిమా చేయాలని
ప్రభాస్ భావిస్తున్నారు.
ఇకపోతే ఇంకా ఎనౌన్స్ కానీ కొన్ని సినిమాలను కూడా
ప్రభాస్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ దర్శకుడు
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆయన ఓ
సినిమా చేయడానికి అంగీకరించారట. అంతేకాకుండా యశ్
రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కబోయే ఓ చారిత్రాత్మక సినిమాలో కూడా నటించడానికి
ప్రభాస్ ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా ఏకంగా ఎనిమిది సినిమాలతో ఆయన ఐదేళ్ల దాకా ఎవరికీ అందనంత స్పీడ్ లో ముందుకు దూసుకు పోతున్నాడు.
సక్సెస్ విషయం లో ఒక అడుగు వెనకనే ఉన్న
ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాలతో
సక్సెస్ ను అందుకుంటాడా అనేది చూడాలి.