నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్ర లో కనిపించబోతున్నా డు.

అలాగే ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది . ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర సినిమా కి హైలైట్ గా నిలువనుందని తెలుస్తోంది . ఇలా ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న మూవీ లో  కీలక పాత్రలో నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ , బాలకృష్ణ తదుపరి మూవీ లో కూడా అదిరిపోయే క్యారెక్టర్ ను దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది . అసలు విషయం లోకి వెళితే ...  బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్క బోయే  మూవీ లో నటించబోతున్న విషయం మన  అందరికీ తెలిసిందే .

ఇది ఇలా ఉంటే ఈ సినిమా లో లేడీ విలన్ పాత్ర ఉండబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే . అయితే ఆ లేడీ విలన్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది . ఇక ఈ మూవీ లో బాలకృష్ణ కూతురు గా శ్రీ లీల కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది . ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ లో బాలకృష్ణ తో పాటు మరో హీరో కూడా నటించబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: