టాలీవుడ్ లో మామూలు హీరో నుండి పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. సినిమా సినిమాకు కూడా అన్ని విషయాలలో వైవిధ్యాన్ని కనబరుస్తూ నేడు పాన్ ఇండియా లెవెల్ లో తన సినిమాలకు ఆదరణ దక్కించుకుంటున్నాడు. ఇదంతా కూడా ఓవర్ నైట్ లో వచ్చింది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఇష్టపడే కథలను ఎంచుకుని, తాను కూడా వారికి నచ్చేలా మారి ఇంతటి ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకున్నాడు. కాగా ఇపుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండనున్నాయి.

అందులో బాలీవుడ్ డైరెక్టర్ తీస్తున్న ఆధిపురుష్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్, ఇంకా పట్టాలెక్కని స్పిరిట్, ప్రాజెక్ట్ కె లాంటి సినిమాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో ఒక సినిమాను చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇప్పటికే ప్రభాస్ స్ర్కిప్ట్ వినడం ఓకె చెప్పడం అన్నీ అయిపోయాయి. ఇక షూటింగ్ మాత్రమే మొదలు కావాల్సి ఉంది. అయితే ఇక్కడే అసలు కథ ఉంది. తాజాగా మారుతి తీసిన పక్కా కమర్షియల్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయింది. ఇందులో గోపీచంద్ మరియు రాశీ ఖన్నా హీరో హీరోయిన్ లుగా నటించారు. సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి కేవలం 6 రోజులు అయింది..

కానీ మొదటి రోజు నుండి ఈ సినిమా టాక్ మాత్రం అంత బాగాలేదు. పైగా గోపీచంద్ కెరీర్ లో మరో ప్లాప్ గా ఇది మిగిలిపోయింది. మారుతి కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ కూడా ఇదే అని చెప్పవచ్చు. ఇలా మారుతి ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఆల్రెడీ ప్రభాస్ కు సాహో మరియు రాధే శ్యామ్ రూపంలో రెండు ప్లాప్ లు పడ్డాయి. ఇప్పుడు మారుతి టైం బాగాలేదు. ఇలాంటి టైం లో ప్రభాస్ సినిమా చేయడం అవసరమా అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి ఏమి జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: