దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే ఒక ప్రేమ కథ చిత్రం తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే . ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా ,  గౌతమ్ వాసుదేవ్ మీనన్ , భూమిక చావ్లా , సుమంత్ ముఖ్య పాత్రల్లో నటించారు .

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను మూవీ యూనిట్ విడుదల చేయగా ,  ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది . ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ సినిమాను వైజయంతి మూవీస్ , స్వప్న సినిమా బ్యానర్ లపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు . ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అశ్వినీదత్ 'సీతా రామం' మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు . తాజా ఇంటర్వ్యూ లో అశ్వినీదత్ మాట్లాడుతూ ... చాలా మంచి మూవీ తీశాం , మూవీ చాలా అద్భుతంగా వచ్చింది . 

ఎప్పటి నుంచో మంచి ప్రేమ కథ మూవీ తియ్యాలి అని అనుకుంటున్నాను .  సీతా రామం మూవీ తో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి మరో చరిత్ర ,  మణిరత్నం గారి గీతాంజలి మూవీ లు చరిత్రలో నిలిచి పోయాయి . సీతా రామం మూవీ కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుంది అని నమ్మకం ఉంది అని తాజా ఇంటర్వ్యూ లో  నిర్మాత అశ్వనీదత్ చెప్పారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి విశాల్ చంద్రశేఖర్ సంగీత ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: