4 ఏళ్ళ పాటు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికే అంకితమైన ఎన్టీఆర్ కు.. ఇప్పుడు కాస్త పెద్ద బ్రేకే దొరికినట్లు వుంది..మార్చి 25న విడుదలైన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం ఇండియా లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి గా నిలిచి న  విషయం అందరి కి తెలిసిందే.


ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.1200 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. ఈ మూవీలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడని చెప్పవచ్చు.. తన పాత్రకి దేశ విదేశాల ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ కూడా వచ్చింది.


తన నెక్స్ట్ మూవీ ని ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడని తెలుస్తుంది.. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంద ని సమాచారం.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పను లు జరుగుతున్నట్టు కూడా వినికిడి. ఇది ఎన్టీఆర్ కు 30 వ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ఇప్పుడు బ్రేక్ టైం దొరకడంతో ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడ ట.. ఈ మధ్యనే విదేశాలకు వెళ్లొచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు తన భార్య.. పిల్లలకు క్వాలిటీ టైంని అయితే కేటాయించాడు.


 


ఈ క్రమంలో తన భార్య లక్ష్మీ ప్రణతి తో కలిసి సరదాగా కాఫీ తాగుతూ ముచ్చటిస్తున్న ఫోటోని షేర్ చేశాడట ఎన్టీఆర్.అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ జంట రొమాంటిక్ గా కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినిమా షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీకి క్వాలిటీ టైంని కేటాయిస్తూ ఉంటాడట ఎన్టీఆర్.అయితే కొన్ని సార్లు అత్యధిక రోజులు బయటి షూటింగ్ లకు వెళ్లడంతో తన ఫ్యామిలీ ని ఎప్పుడు మిస్ అవుతు ఉంటాడట ఎన్టీఆర్. అందుకే దొరికిన సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: