కృష్ణంరాజుకి కొడుకులు లేకపోవడంతో అంత్యక్రియలు ఎవరు నిర్వహిస్తారనే చర్చలు అయితే జరిగాయి.కృష్ణంరాజు చనిపోవడానికి ముందే తన కర్మక్రియలను ఎవరు నిర్వహించాలనే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. కృష్ణంరాజు మొదటి భార్య యాక్సిడెంట్ లో చనిపోయారు.వీరికి ఒక కూతురు ఉంది. అప్పట్లో ఆమెకి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. ఆ తరువాత శ్యామలాదేవిని రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణంరాజు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. కొడుకు కోసం వేచి చూసిన కృష్ణంరాజు దంపతుల కోరిక తీరలేదు. అయితే కొడుకులు లేరనే లోటు తన సోదరుడి కొడుకులు ప్రభాస్, ప్రభోద్ లతో తీరిందని చెప్పారు కృష్ణంరాజు. తాను హిందూ ధర్మాన్ని పాటిస్తానని.. చనిపోయిన తరువాత జరిగే కర్మక్రియల గురించి తెలుసుకున్నానని అన్నారు.

 రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ఇవాళ పూర్తయ్యాయి. కన్నీళ్లతో ఆయన కుటుంబసభ్యులు తుది వీడ్కోలు పలికారు. ప్రభాస్ అన్నయ్య అయినటువంటి ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాలు నిర్వహించారు.
ప్రభుత్వ లాంఛనాలతో మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు గారి  అంత్యక్రియలను నిర్వహించారు. కృష్ణంరాజుని చివరిచూపు చూసుకోవడం కోసం అభిమానులు చాలామంది వచ్చారు. అయితే కేవలం కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులను మాత్రమే ఫామ్‌హౌస్‌లోకి అనుమతించారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఉండడానికి కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించామని పోలీసులు చెప్పారు .

 కృష్ణంరాజు గారి మరణాన్ని కుటుంబసభ్యులు తట్టుకోలేకపోతున్నారు. ఆయన భార్య, కూతుళ్లతో పాటు ప్రభాస్ కూడా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశారు. కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి అయితే తన భర్త పాడెను మోసి అతడిపై ఉన్న ప్రేమను  వ్యక్తపరిచారు . ఆ దృశ్యాలు గుండెబరువెక్కే విధంగా ఉన్నాయి. సెలబ్రిటీలందరూ కూడా కృష్ణంరాజుకి నివాళులు అర్పించారు.అలాగే సినిమా సెట్స్ లో కూడా కృష్ణంరాజుకి శ్రద్ధాంజలి ఘటించారు.

మెగాస్టార్ చిరంజీవి తన సినిమా సెట్స్ లో కృష్ణంరాజు ఫొటో ఏర్పాటు చేసి.. తన టీమ్ తో కలిసి మరోసారి నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవిగారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే సంచలన దర్శకుడు అయినటువంటి ఆర్జీవీ షూటింగ్స్ ఆపేసి కృష్ణంరాజుకి నివాళులు అర్పించాలంటూ పోస్ట్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: