టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా అలాగే స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 3 వ సినిమా తెరకెక్కుతుంది. #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటివలే ఓ యాక్షన్ ఎపిసోడ్ తో మొదటి షెడ్యుల్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి రెండో షెడ్యుల్ కూడా త్వరలోనే మొదలు కానుంది.తాజాగా సూపర్ స్టార్ మహేష్ అమ్మ ఇందిరా దేవి గారి మరణంతో సెకండ్ షెడ్యుల్ కి బ్రేక్ పడింది. దీంతో ఆ షెడ్యుల్ ప్లానింగ్ మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


మొట్టమొదటిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ ఐటెం సాంగ్ పెట్టనున్నాడనేది ఆ న్యూస్.లేటెస్ట్ గా ఈ విషయంపై నిర్మాత నాగ వంశీ కూడా స్పందించాడు. సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకుంటున్న మాట వాస్తవమే. కానీ ఇంకా డిసిషన్ తీసుకోలేదు. మహేష్ గారి ఫ్యాన్స్ , మాస్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ పెడితే బాగుంటుందని త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఇంకా డిసిషన్ తీసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. 


ఇక మహేష్ – త్రివిక్రమ్ గార్ల కాంబోలో వచ్చిన ‘అతడు’ సినిమా హిట్ అవ్వగా ‘ఖలేజా’ మాత్రం థియేటర్స్ లో అనుకున్నంత ఆదరణ అందుకోలేకపోయింది. అయితే ఆ రెండు సినిమాలు కూడా టివీ లో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్నాయి. కానీ ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని మించి సినిమా ఉండబోతుందని నమ్మకం వ్యక్తం చేశాడు నాగ వంశీ.సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ అయితే ఉండదు కానీ ఓ స్పెషల్ పబ్ సాంగ్ మాత్రం పెడుతుంటాడు. ఇప్పుడు మహేష్ బాబు కోసం తన సినిమాలో మరో కమర్షియల్ ఎలిమెంట్ ఫిక్స్ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది. మరి మహేష్ కోసం త్రివిక్రమ్ తన పంథా మార్చుకొని సుకుమార్ లా ఐటెం సాంగ్ తో హంగామా చేస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: