పుష్ప మొదటి భాగం ఎక్కడ చూసినా మంచి విజయాన్ని సాధించింది. దీంతో పుష్ప సినిమా సీక్వెల్ పైన మరింత అంచనాలు పెట్టుకున్నారట. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక ,అనసూయ ,సునీల్ తదితరులు నటించారు.


ఈ చిత్రాన్ని సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పుష్ప -2 సినిమా షూటింగ్ సంబంధించి పలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా డైరెక్టర్ తేజ ఈ సినిమాపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.


 

డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. అందరూ చెప్పుకుంటున్నట్లు పుష్ప చిత్రం హీట్ అయితే కాదని తేల్చేశారు. కొన్ని ఏరియాలలో బయ్యార్ లకి పుష్ప చిత్రం భారీ నష్టాలను మిగిల్చిందని తెలియజేశారు. కేవలం ఈ సినిమా నార్త్ లో బాగా ఆడటం వల్లే సక్సెస్ అయింది అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అని కామెంట్లు చేయడం కూడా జరిగింది. తెలుగులో ఈ సినిమా పెట్టిన డబ్బులు మొత్తం రికవరీ చేయలేక నష్టాలు ఎక్కువగానే ఉన్నాయని తెలిపారు. పుష్ప రిలీజ్ అయినప్పుడు తెలుగులో నెగటివ్ టాక్ ,నెగిటివ్ రివ్యూలు వచ్చాయి కానీ అందులో అల్లు అర్జున్  యాటిట్యూడ్, సాంగ్స్ తోనే ఈ సినిమా నార్తులో మంచి క్రేజ్ అందుకుంది. కానీ తెలుగులో లాభాలను తెచ్చి పెట్టలేకపోయింది అని ఆయన తెలియజేశారు.


 

ప్రస్తుతం థియేటర్లలో పెరిగిన టికెట్లు ధరల వల్ల, ఫుడ్ ఐటమ్స్ ధరల వల్ల ఆడియన్స్ థియేటర్లకి ఎక్కువగా రాలేదని తేజ తెలియజేశారు. ఇలా ధరలు పెంచడం కరెక్ట్ కాదని పాప్ కార్న్, కూల్ డ్రింక్ ఇతర ఐటమ్స్ ధరలు పెంచితే ఇండస్ట్రీకి నష్టమని తెలియజేశారు తేజ. ప్రస్తుతం తేజ దగ్గుబాటి అభిరామ్ తో హీరోగా అహింస అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. కేవలం నార్త్ లో వచ్చిన సక్సెస్ వల్లే పుష్ప 2 ని కూడా డైరెక్టర్ సుకుమార్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలియజేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారుతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: