టాలివుడ్ హీరో నటుడు బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షోకీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం సంగతీ మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ షోకి టాలీవుడ్ సురేష్ బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అలాగే అల్లు అరవింద్  కూడా హాజరయ్యారు ఈ షో కి.


ఈ నేపథ్యంలోనే వారి ముగ్గురు ఎన్నో రకాల విషయాలను కుడా వెల్లడించారు . బాలయ్య బాబుతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే సురేష్ బాబు సమంత నాగచైతన్య జంట గురించి ఇలా స్పందించారు. ఇక ఈ షోలో బాలయ్య బాబు ఒక టాస్క్ లో భాగంగా ఈ తరం మహానటి ఎవరో చెప్పాలి అని అడగగా వెంటనే సురేష్ బాబు, అల్లు అరవింద్ ఒకే అభిప్రాయం ఆ ఛాన్స్ కేవలం ఒక సమంతకు మాత్రమే ఉంది అని వారు తెలిపారు.

ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ఈ జనరేషన్ లో మహానటి సావిత్రి అంతటి ఫేమ్ సమంత తెచ్చుకునే అవకాశం కలదు. ఆమెకు ఆ అర్హత  కుడా ఉందని  సురేష్ బాబూ చెప్పుకొచ్చారు. లెజెండ్ సావిత్రితో పోల్చడం అంటే చిన్న ప్రశంస కాదు మరీ. మూడు నాలుగు తరాల హీరోయిన్స్ ని చూసిన సురేష్ బాబు ఆ గౌరవానికి సమంతను ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపోతే సమంత నాగచైతన్యలు విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే మరీ. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తల వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నాగచైతన్యకు మేనమామ అయిన దగ్గుబాటి సురేష్ బాబు అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ ఆ విషయం పట్ల అలా స్పందించారు.

సమంత గురించి వాళ్లు నెగిటివ్ గా అనుకుంటున్నాటూ అంటూ అనేక రకాల వార్తలు  బాగానే వినిపించాయి. అ సమయంలో దగ్గుపాటి ఫ్యామిలీ ఆ వార్తల పై స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమే అని చాలామంది విశ్వసించారు మరి. ఇక తాజాగా సురేష్ బాబు సమంతని పొగుడుతూ మాట్లాడిన తీరును బట్టి చూస్తే నాగచైతన్య సమంత దూరమైనందుకు ఆ కుటుంబానికి ఎటువంటి కోపం లేదు అని తేలిపోయింది. మొత్తానికి ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టినట్టు అయింది.. ఆయన మాటలను బట్టి చూస్తే విడాకులు అన్నది వారి వ్యక్తిగత సమస్య కాబట్టి ఎవరిని తప్పు పట్టకూడదు అన్న విధంగా ఆలోచించారు అని  మనకి అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: