ఎస్ఎస్ రాజమౌళి.. ఇది కేవలం ఒక దర్శకుడు పేరు మాత్రమే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇది ఒక బ్రాండ్ అన్నట్లుగానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  ఎందుకంటే తన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి. ఒక సాదాసీదాస్ సీరియల్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇక ఇప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుడు స్థాయికి ఎదిగాడు అని చెప్పాలి. ఇక ఎప్పుడు రాజమౌళి ఏదైనా సినిమాను తెరకెక్కిస్తూ ఉన్నాడు అంటే చాలు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టడం ఖాయం అని అభిమానులు భావిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక రాజమౌళి సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల సైతం వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. అయితే జక్కన్న తన సినిమాల విషయంలో ఎంత పర్ఫెక్షన్ తో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ పర్ఫెక్షన్ ప్రేక్షకులకు బాగా నచ్చేస్తూ ఉంటుంది. అందుకే జక్కన్న సినిమాలన్నీ సూపర్ హిట్ సాధిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక రాజమౌళి తెరకెక్కించిన ఏ సినిమాకు కూడాప్రేక్షకులు వంక పెట్టడానికి ఉండదు అని చెప్పాలి. ప్రేక్షకులకు నచ్చాయి కాబట్టే ఇక రాజమౌళి సినిమాలు అంత పెద్ద విజయాలను సాధించాయి.

 కానీ రాజమౌళి సతీమణి అయిన రమా రాజమౌళికి మాత్రం ఇక జక్కన్న తెరకెక్కించిన ఒక సినిమా అస్సలు నచ్చదట. ఆ సినిమా ఏదో కాదు ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తనకు అంతగా నచ్చలేదు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రమా రాజమౌళి. అయితే ఈ సినిమాలో తారక్ మాత్రం అద్భుతంగా నటించాడు అంటూ ప్రశంసలు కురిపించారు ఆమె. కేవలం తారక్ నటన వల్లే ఈ సినిమా నిలబడిందని.. గతంలో రమ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: