డైరెక్టర్ మణిరత్నం ఎన్నో సంవత్సరాలుగా కలగన్న డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదటి భాగాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని చోళుల కథ ఆధారంగా తెరకెక్కించారు. గత 30 ఏళ్లుగా కలలు కంటున్న మణిరత్నం ఈ చిత్రాన్ని కమలహాసన్ , ఎం.జి రామచంద్రన్ రజనీకాంత్ వంటి స్టార్లతో తెరకెక్కించాలనుకున్నారు. ఆ తర్వాత విజయ్ మహేష్ బాబు లతో కలిసి ఈ ప్రాజెక్టుని తెరకెక్కించాలనుకున్నారు. బడ్జెట్ విషయంలో నిర్మాతలు సహాయం చేయకపోవడంతో ఈ సినిమాని కొన్ని కారణాల చేత పోస్ట్ ఫోన్ చేయవలసి వచ్చింది.
కానీ ఫైనల్ గా విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీక్, త్రిష, జయం రవి తదితర నటీనటులతో విచిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్ 30 వస్తే ఏదైనా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని భాషలలో కూడా ఈ సినిమా తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.500 కోట్ల మేరకు కలెక్షన్లు సాధించింది.

ఐశ్వర్యారాయ్ కార్తీక్ త్రిష నటనకు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది ఇదంతా ఇలా ఉండగా పొన్నియన్ సెల్వన్ -2 చిత్రాన్ని ఏప్రిల్ విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి  ఐమాక్స్ ఫార్మాట్లో ఈ సినిమాని ఏప్రిల్ 28న అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున అధికారికంగా ప్రకటించింది ఈ సందర్భంగా చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ చిత్రం ఎంతో తమిలులను బాగా ఆకట్టుకుంది. ప్రముఖ సీనియర్ ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. మొదటి భాగంలో పలు మార్పులు చేసి పార్ట్ -2 నీ మరింత  భారీ బడ్జెట్ నిర్మించి విడుదల చేయాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: