టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ''పుష్ప ది రూల్'' ఒకటి.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.మన సౌత్ ప్రేక్షకుల కంటే కూడా నార్త్ ప్రేక్షకులు ఈ సినిమాపై ఇంకా ఆసక్తిగా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ఇది.. ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.. ఇక ఈ అప్డేట్ తర్వాత పుష్ప సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా అంచనాలు డబల్ అయ్యాయి. శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా షూట్ గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

పుష్ప 2 కు సంబంధించిన కీలక ఎపిసోడ్స్ ను ఇప్పటికే తెరకెక్కించిన సుకుమార్ ఇప్పుడు బ్యాలెన్స్ గా ఉన్న క్లైమాక్స్ సీక్వెన్స్ ను తెరకెక్కించేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నారట.. ఈ క్లైమాక్స్ షూట్ కోసం భారీ సెట్ ను వేయిస్తున్నారని ఈ సీక్వెన్స్ లో రష్మిక పాత్రకు సంబంధించిన డెత్ మిస్టరీ రివీల్ అవుతుంది అని టాక్.. మరి క్లైమాక్స్ ను సుకుమార్ భారీ స్థాయిలోనే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.. మొత్తానికి పుష్ప 2 షూట్ ను ఫాస్ట్ గానే పూర్తి చేస్తున్నాడు.. ఇక ఈసారి పుష్ప 1 ను మించిన అగ్ర కాస్టింగ్ ను సుకుమార్ యాడ్ చేసుకుంటూ పోతున్నాడు. చూడాలి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: