అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు మధ్య ఎంత బలమైన స్నేహబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఒకరిని ఒకరు బావ అంటే బావ అని పిలుచుకుంటూ ఉంటారు. ఒకరి సక్సెస్ను ఒకరు సెలబ్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ ఇద్దరు హీరోలకు సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తారక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఒక హీరోయిన్ అల్లు అర్జున్ మూవీలో ఐటెం సాంగ్ చేయబోతుందట.
జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర అనే మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రూపొందుతుంది. అయితే ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది అని చెప్పాలి. ఇదే ఆమెకు తెలుగులో మొదటి సినిమా. కాగా 2024 ఏప్రిల్ 5వ తేదీన దేవర సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే పుష్ప 2 లో అటు రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా 2024 ఆగస్టు 15వ తేదీన రాబోతుంది. అయితే తొలి భాగంలో సమంత స్పెషల్ సాంగ్ హైలెట్గా నిలిచినట్టే.. సెకండ్ పార్ట్ లోను ఐటమ్ సాంగ్ సినిమాకు ఏసెట్ గా మారనుందట. ఇక ఈ పాటలో జాన్విని ఫిక్స్ చేశారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి