ఈ మధ్యకాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని ఊహించిన విధంగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు.కోలీవుడ్ స్టార్ జంట ధనుష్ ఐశ్వర్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కోలివుడ్ స్టార్ జంట ధనుష్ ఐశ్వర్యలు తమ 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.  వీరి విడాకుల విషయం తెలిసి ధనుష్ రజనీకాంత్ అభిమానులు చాలా ఫీలయ్యారు. దానితోపాటు రజనీకాంత్ సైతం కూతురి 

వివాహ జీవితం ఇలా అయ్యింది అని డిప్రెషన్ లోకి కూడా వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక వీరి వీడాకుల తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే వారు విడిగా ఉంటున్నారు. కానీ ఇప్పటివరకు విడాకులు తీసుకున్నట్లు ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ధనుష్ రజనీకాంత్ అభిమానులు మళ్లీ వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అంటూ చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ మల్లి భార్యాభర్తలుగా కలిసే 

ఆలోచనలో ఇద్దరూ కూడా లేరు అన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇద్దరిలో ఏ ఒక్కరైనా రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటే విడాకులకు అప్లై చేసుకునేవారు. కానీ వీరిద్దరూ ప్రస్తుతం సినిమా బిజీలో పడిపోయారు. అందుకే విడాకుల కోసం అప్లై చేసుకోలేదని తెలుస్తోంది.అయితే భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తల్లిదండ్రులుగా మాత్రం తమ పిల్లలకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటున్నారు.  ఏదేమైనాప్పటికీ భార్యాభర్తలుగా దూరంగా ఉన్నప్పటికీ తమ పిల్లల కోసం తల్లిదండ్రులుగా ప్రతి విషయంలో కలిసి వీరిద్దరూ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఐశ్వర్య ధనుష్ లను మెచ్చుకుంటున్నారు నెటిజన్స్. అలా ప్రస్తుతం ధనుష్ ఐశ్వర్యలకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: