తమిళంలో స్టార్ కొరియోగ్రఫర్ గా పేరు తెచ్చుకున్న అమ్మ రాజశేఖర్ టాలీవుడ్ లో ఒకప్పుడు చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, నితిన్, గోపీచంద్ లాంటి స్టార్ హీరోస్ సినిమాలకు కొరియోగ్రఫీ చేసి ఇక్కడ కూడా పాపులర్ అయ్యాడు. కొరియోగ్రాఫర్ గా కెరియర్ సరిగ్గా సాగుతున్న సమయంలో దర్శకుడి అవతారం ఎత్తాడు. అందులో తీవ్రంగా దెబ్బతిన్నాడు. నితిన్ తో టక్కరి, గోపీచంద్ తో రణం వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత ఇండస్ట్రీకి చాలా కాలం పాటు దూరమయ్యాడు. మళ్లీ తెలుగులో బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని తన ఆట తీరుతో ఆకట్టుకున్న అమ్మ రాజశేఖర్ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు..ఆర్తి అగర్వాల్ తో రణం 2 తీశాను. షూటింగ్ మొదట్లో ఎంతో అందంగా వచ్చింది. ఆరు నెలల తర్వాత మళ్లీ ఓ షెడ్యూల్ ప్లాన్ చేశాం. అప్పుడు చాలా లావై వచ్చింది. సెట్స్ లో ఆమె వచ్చిందని నాకు తెలియదు. తను కారవాన్ లో ఉంది. నేను ఆమె కోసం వెయిట్ చేస్తున్నా. రాకపోయేసరికి నేనే ఆమె దగ్గరికి వెళ్లాను. నాకు ఆర్తి అగర్వాల్ పర్సనల్ గా చాలా ఇష్టం. 

నేను ఆర్తి అగర్వాల్ దగ్గరికి వెళ్తే కారవాన్ లో కూర్చుని ఏడుస్తుంది.. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగితే నేను వల్గర్ గా ఉన్నానా, అసహ్యంగా ఉన్నానా.. రాజశేఖర్ చెప్పు అని ఏడ్చేసింది. నువ్వు టెన్షన్ పడకు, కాస్ట్యూమ్ వేసుకుని ఒక షాట్ చేయి చాలు. ఆ తర్వాత రెండు నెలలు ఆగి షెడ్యూల్ పెడతా అని చెప్పాను. అప్పుడు షూటింగ్లో ఉన్న వాళ్లంతా ఆర్తి అగర్వాల్ బాగా లావైంది ఏంటి? అని అడిగితే అలా అవమని నేనే చెప్పాను. ఎందుకంటే ఈ మూవీ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో లావుగా కనిపించాలి.  అందుకే ఆ సినిమా తీయడానికి మూడు సంవత్సరాలు పట్టింది. కాని చివరికి ఆమె చనిపోయిందని మెసేజ్ రావడం బాధ కలిగించింది" అంటూ అమ్మ రాజశేఖర్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: