కళ, నాటకాల నేపథ్యంలో దిలీప్, రెజీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్ బిల్ పిక్చర్స్ పతాకంపై సురేష్ పాటిల్ నిర్మించారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, 'రచ్చ' రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. విడుదలకు రెడీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతరించిపోతున్న నాటక రంగం, కళాకారుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు

ఇటీవల రిలీజ్ చేసిన ఉత్సవం ఫస్ట్ లుక్ లో హీరో పాత్ర పోషించిన దిలీప్ ప్రకాష్ ఒక చేతిలో నటరాజ విగ్రహం, మరో చేతిలో కిరీటం పట్టుకుని నేలపై కూర్చున్నట్లు కనిపించారు. తనచుట్టూ నాటక ప్రదర్శనలో వాడే వస్తువులు వున్నాయి. అతని ముఖంలోని చిరునవ్వు కళ పట్ల అతని అభిరుచి, ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఫస్ట్ లుక్ ఆహ్లాదకరంగా ఉంది. పాజిటివ్ ఇంపాక్ట్ ని కలిగించింది. ది షో మస్ట్ గో ఆన్ అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తి పెంచింది.కాగా ఈ ఫస్ట్ లో రిలీజ్ చేసినప్పుడే ఉత్సవం టీజర్ అప్డేట్ ఇచ్చారు 'రిహార్సల్స్ ఆఫ్ ఉత్సవం' పేరుతో జనవరి 28న టీజర్ రిలీజ్ చేసినట్లు ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆదివారం ఉత్సవం టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.  

ఉత్సవం టీజర్ విషయానికొస్తే.. 'కళాకారుడు చనిపోవచ్చు కానీ కల చనిపోకూడదు' అంటూ ప్రకాష్ రాజ్ బ్యాగ్రౌండ్ లో చెప్పే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. '15 ఏళ్ల అయింది రా పాత్ర వేసి.. నుదుట బొట్టు పెట్టుకోగానే కన్నీటి బొట్టు ఆగలేదు' అంటూ ఎల్బీ శ్రీరామ్ చెప్పే డైలాగ్ ఎమోషనల్ గా టచ్ చేసింది. ఆ తర్వాత సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, నాజర్, రఘు బాబు, ఆమని, బ్రహ్మానందం, అలీ తదితరుల పాత్రలను చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య బాండింగ్ ఆకట్టుకుంది. ఇక టీజర్ లో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. వీటన్నింటితో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: