ఈ నగరానికి ఏమైంది సినిమాతో కమెడియన్ గా పరిచయమైన అభినవ్ గోమఠం వరుస సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇక ఈమధ్య కమెడియన్స్ కూడా సోలో సినిమాలు అటెంప్ట్ చేస్తున్నారు. లిమిటెడ్ బడ్జెట్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు వారు ముందుకొస్తున్నారు. ఇలాంటి ప్రయత్నమే అభినవ్ గోమఠం కూడా చేశాడు. అతను హీరోగా వస్తున్న సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో అభినవ్ గోమఠం సీనియర్ స్టార్స్ సినిమాల గురించి ఆసక్తికరంగా మాట్లాడాడు.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలకు మీడియా రివ్యూస్ ఇవ్వడం మానేయాలని. వాళ్ల సినిమాలను మనం సెలబ్రేట్ చేసుకోవాలి కానీ రివ్యూస్ ఇవ్వకూడదు. వారు చూడని సర్క్సెస్ అంటూ లేదు. వారు చేస్తున్న ప్రయత్నాలను మనం సెలబ్రేట్ చేసుకోవాలి కానీ రివ్యూస్ ఇచ్చి వారిని కించపరచకూడదని అన్నాడు అభినవ్ గోమఠం.

ఇక సోషల్ మీడియాలో స్టార్ వార్స్ గురించి కూడా అది కొందరు మాత్రమే చేస్తున్న పని అని. నిజమైన అభిమానులు అలా చేయరని అన్నాడు. సీనియర్ స్టార్స్ సినిమాలకు రివ్యూస్ అవసరం లేదని అలా ఇచ్చి వారిని కించ పరచడమే అవుతుందని అన్నాడు. ఓ విధంగా అభినవ్ చెప్పింది చూస్తే కరెక్టే అనిపిస్తుంది. సీనియర్ హీరోల సినిమాలకు రివ్యూస్ లా కాకుండా వారి సినిమాను ఫెస్టివల్ చేసుకునేలా ఉంటే బెటర్ అనిపిస్తుంది. కానీ మీడియా అభినవ్ కామెంట్స్ ని అసలు పట్టించుకుంటుందా చెప్పండి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే రివ్యూ ఇవ్వాల్సిందే సినిమా తేడా వస్తే చీల్చి చెండాడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. తప్పకుండా అభిన చెప్పిన ఈ పాయింట్ మీద రివ్యూయర్స్ దృష్టి పెడితే తప్పకుండా ఆ స్టార్స్ కి మనం ఇచ్చిన రెస్పెక్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: