తెలుగు సినీ పరిశ్రమ లో కొన్ని సినిమా లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మ అన్షు అంబానీ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా రూపొందిన మన్మధుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది . ఈ సినిమా లో ఈ బ్యూటీ చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రనే చేసినప్పటికీ ఇందులో ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇకపోతే ఈమె రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన ఈశ్వర్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా కూడా ఈ ముద్దు గుమ్మకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే వరుస సినిమా అవకాశాలు వస్తున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మ సడన్ గా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈ బ్యూటీ వరుస సినిమా అవకాశాలు వస్తున్న సమయం లోనే ఎందుకు సినిమాల నుండి తప్పుకొని పెళ్లి చేసుకుంది అనే విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అన్షు అంబానీ మాట్లాడుతూ ... నాకు సినిమాల్లో వరుసగా సెకండ్ హీరోయిన్ అవకాశాలే వచ్చాయి. ఎంత కాలం ఎదురు చూసినా కానీ అలాంటి అవకాశాలే వస్తూ ఉండటంతో నాకు విసుగు వచ్చేసింది. దానితో సినిమాలను వదిలేసి పెళ్లి చేసుకుని ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా లండన్ లో ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ సినిమాలను వదిలేయడం గురించి చెప్పుకొచ్చిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: