గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ 26 ఫిబ్రవరి 2024న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఫిబ్రవరి 27న జరిగాయి. నటి విద్యాబాలన్ కూడా ఆయనను చివరి చూపు చూసేందుకు వచ్చారు.అక్కడ ఆమె అభిమానుల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్య బాలన్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఈ వీడియోలో నటి అభిమాని ఆమెను ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేశాడు. విద్యతో పాటు వచ్చిన ఓ అమ్మాయి ఆ వ్యక్తిని పదేపదే తిరస్కరిస్తున్నట్లు వైరల్ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఇదిలావుండగా విద్యాబాలన్ వైపు మొబైల్ చూపిస్తూ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు అతడు. అయితే విద్యాబాలన్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఇప్పుడు ఈ వీడియో చూసిన జనాలు ఈ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో విద్యాబాలన్ ఆ వ్యక్తిని ఏమీ అనలేదంటూ జనాలు ఆమెను కొనియాడుతున్నారు.

కొందరు నెటిజన్స్ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. 'సమయం ఏమిటో, స్థలం ఏమిటో అర్థం చేసుకోని వ్యక్తులు కొందరు ఉన్నారు.' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "కొంతమందికి హృదయం లేదు. 'వారికి సెల్ఫీలు కావాలి అని కొందరు. మరికొందరు ఇడియట్ అని కామెంట్స్ చేస్తున్నారు. 'ఆమె సెల్ఫీకి బదులుగా చెంపదెబ్బ కొట్టాలి.' అని రాసుకొచ్చారు.మంగళవారం పంకజ్ అంత్యక్రియలకు సోనూ నిగమ్, అనూప్ జలోటా, తబలా మాస్ట్రో, జాకీర్ హుస్సేన్‌తో సహా బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు తారలు హాజరయ్యారు. విద్యాబాలన్ కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు, అక్కడ సెల్ఫీ కోసం ఒక వ్యక్తి ఆమెను వేధించాడు. ఇక విద్య బాలన్ ల విషయానికొస్తే.. విద్యాబాలన్ త్వరలో కార్తీక్ ఆర్యన్, తృప్తి దిమ్రీలతో కలిసి 'భులయ్యా 3' చిత్రంలో మంజులిక పాత్రలో నటిస్తున్నారు. ఇది కాకుండా, ఆమె 'దో ఔర్ దో ప్యార్' చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మార్చి 29న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: