![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestylebde9fde0-e2fa-44ca-9343-d999bd8a6627-415x250.jpg)
ఈ క్రమంలో ఓ జంట పర్ఫెర్మెన్స్ నెక్ట్స్ లెవల్ ఇంటెన్సిటితో ఉంది. రొమాంటిక్గా ఉంది. ఇది చూస్తూ శేఖర్ మాస్టర్ విభిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. ఇది హైపర్ ఆది గమనిస్తున్నాడు. ఈ పర్ఫెర్మెన్స్ అయిపోయిన తర్వాత శేఖర్ మాస్టర్ బాటిల్లో నీళ్లు తాగేశాడు. దీనికి వెంటనే హైపర్ ఆది రియాక్ట్ అయ్యాడు. బాబోయ్.. మీరు ఎంత దాహంతో ఉన్నారండి బాబూ అని డబుల్ మీనింగ్ వచ్చేలా కామెంట్ చేశాడు. ఇదే ఇప్పుడు రచ్చ అవుతుంది. దీనికి షో మొత్తం హోరెత్తిపోయింది.హైపర్ ఆది ఫన్నీగానే అన్నాడు. జనరల్గా శేఖర్ మాస్టర్, ఆది మధ్య ఇలాంటి కన్వర్జేషన్ ఫన్ కోసం నడుస్తూనే ఉంది. కానీ దీన్ని కొందరు సీరియస్గా తీసుకుని శేఖర్ మాస్టర్ నిజంగానే దాహంతో ఉంటాడని, ఆయన దాహం తీరనిది అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. చాలా డబుల్ మీనింగ్ వచ్చేలా వాళ్లు రియాక్ట్ కావడమే ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ పాల్గొన్నాడు శేఖర్ మాస్టర్. యాంకర్ రష్మితో ఆయన సరసాలు ఆడటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆది కామెంట్లు మరింత రచ్చ లేపుతున్నాయి.