సౌత్ ఇండస్ట్రీలో హీరో ఆర్. మాధవన్‏కు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. సఖి తో అప్పట్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. కానీ ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు అంతగా మెప్పించలేకపోయాయి.వైవిధ్యమైన లను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరిసారిగా రాకెట్రీ చిత్రంలో కనిపించిన మాధవన్.. ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘రైల్వే మెన్’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇందులో జూహీ చావ్లా నటిస్తుంది. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాధవన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో తాను జూహ్లీ చావ్లాను పెళ్లి చేసుకోవాలనుకున్నానని.. అదే విషయాన్ని తన తల్లితో కూడా చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం మాధవన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మాధవన్ మాట్లాడుతూ..” నేను అందరి ముందు ఈ నిజాన్ని ఒప్పుకోవాలనుకుంటున్నాను. ఖయామత్ సే ఖయామత్ చేసి జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అప్పట్లో ఆమెను పెళ్లి చేసుకోవడమే నా ఏకైక లక్ష్యం. ఇదే విషయాన్ని మా అమ్మతో కూడా చెప్పాను” అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తన జూహీతో కలిసి చేసే అవకాశమే రాలేదని అన్నారు. హిందీలో మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఖయామత్ సే ఖయామత్ తక్ మూవీలో అమీర్ ఖాన్, జూహీ కలిసి నటించారు. 1988లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టిన కూడా ఇదే. ఈ తోనే ఉత్తమ నటి తెరంగేట్రం అవార్డు సహా ఎనిమిది ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది.ఖయామత్ సే ఖయామత్ తక్ విడుదలైనప్పుడు మాధవన్ ఇంకా నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. సఖి తో హీరోగా వెండితెరకు పరిచయమైన మాధవన్.. ఆ తర్వాత తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. 2001లో రెహానా హై టెర్రే దిల్ మేతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. గతేడాది వచ్చిన రాకెట్రీ తో దర్శకుడిగా మారారు మాధవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: