దివంగత డైరెక్టర్ టి కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు హీరో గోపీచంద్.. మొదట విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన నెమ్మదిగా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న గోపీచంద్ ఈ నేపథ్యంలోనే భీమా అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. మార్చి 8న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతోంది.. విడుదల సమయం దగ్గర పడుతూ ఉన్న కొద్దీ ఈ సినిమా ప్రమోషన్స్ ని చిత్ర బృందం వేగవంతం చేశారు.


 కమెడియన్ ఆలీ హోస్టుగా వ్యవహరించే ఒక టీవీ షో కి అతిదిగా వచ్చిన గోపీచంద్ ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలు తెలియజేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.. కొంతమంది పిల్లలను చదివిస్తున్నావ్ అంటూ కనీసం ఎందుకు బయటకు చెప్పుకోలేదు అంటూ ఆలీ అడగగా అందుకు సమాధానంగా.. గోపీచంద్ ఇలా మాట్లాడుతూ అలా చెప్పుకోవడం ఎందుకో నాకు ఇష్టం ఉండదు.. ఆ పిల్లలలో కొంతమంది నా పేరు కూడా తెలియదు బాగా చదువుతున్నారా చదివిద్దామని అంతె తప్ప మరే ఉద్దేశం లేదని తెలిపారు..


తండ్రి కృష్ణ లాగే గోపీచంద్ కూడా ఎంతో గొప్ప మనస్తత్వం కలిగిన హీరోగా పేరు సంపాదించారు. ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కరోనా సమయంలో కూడా ఎన్నో మంచి పనులు చేశారు. ముఖ్యంగా తన పిల్లలను కూడా స్టార్ స్టేటస్కు దూరంగానే ఉంచుతూ సాధారణ పిల్లలుగానే పెంచుతున్నారు.. అందుకే గోపీచంద్ గురించి తెలిసిన వారంతా కూడా అతను ఎంత ఉంటారనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.. గోపీచంద్ కెరియర్లో మొహమాటానికి పోయి ఎన్నో సినిమాలు చేశానని వాటి వల్ల ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారని తెలియజేశారు.. ఏది ఏమైనా గోపీచంద్ చేస్తున్న ఈ పన్నుల వల్ల కచ్చితంగా గోపీచంద్ కుటుంబాన్ని అభినందించాలని పలువురు నెటిజన్స్ అభిమానులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: