మాస్ మహారాజా రవితేజ కెరియర్ లో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాలలో విక్రమార్కుడు మూవీ ఒకటి. ఈ మూవీ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... అనుష్కమూవీ లో రవితేజ కు జోడి గా నటించింది. ఇకపోతే ఈ సినిమాకు రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో రవితేజ దొంగగాను ... పోలీస్ ఆఫీసర్ పాత్రలోనూ నటించాడు.

మూవీ లో డ్యూయల్ రోల్ లో నటించిన రవితేజ ఈ సినిమాలో తన నటనతో అద్భుతమైన రేంజ్ లో ప్రేక్షకులను , విమర్శకులను మెప్పించాడు. ఇకపోతే ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా "విక్రమార్కుడు 2" రాబోతుంది అని విజయేంద్ర ప్రసాద్ ఆ సినిమాకు కథను తయారు చేస్తున్నాడు అని గత కొన్ని నెలలుగా వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈ వార్తలపై నిర్మాత కే కే రాధా మోహన్ స్పందించాడు. తాజాగా కే కే రాధా మోహన్ మాట్లాడుతూ ... ప్రస్తుతం విక్రమార్కుడు సీక్వెల్ రైట్స్ నా దగ్గర ఉన్నాయి. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో "విక్రమార్కుడు 2" అనే టైటిల్ ను కూడా నేను రిజిస్టర్ చేయించాను. రాజమౌళి తో పాటు సీక్వెల్ కోసం మరో దర్శకుడుతో కలిసి పని చేయడానికి రవితేజ ఆసక్తి చూపించలేదు అని తాజాగా కే కే రాధా మోహన్ వ్యాఖ్యలు చేశాడు. ఇకపోతే తాజాగా ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: