ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన సీనియర్ స్టార్ హీరోయిన్ లో ఒకరు అయినటు వంటి మనీషా కొయిరాలా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె మణిరత్నం దర్శకత్వం లో రూపొందిన ముంబై మూవీ లోను , శంకర్ దర్శకత్వం లో రూపొందిన ఒకే ఒక్కడు మూవీ లోను హీరోయిన్ గా నటించి  బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని హీరోయిన్ గా నటించి అద్భుతమైన నటి గా గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 

ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. తాజాగా మనీషా "హిరామండి" అనే వెబ్ సిరీస్ లో నటించింది. దీనికి బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా బంసాలి దర్శకత్వంలో నటించాలి అని 28 సంవత్సరాల పాటు ఎదురు చూశాను. అంతటి తీవ్ర నిరీక్షణ ఈ వెబ్ సిరీస్ తో ముగిసింది అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. 

ఇకపోతే ఈ బ్యూటీ హిరామండి వెబ్ సిరీస్ కంటే ముందు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన "ఖమోశీ" అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా 1996వ సంవత్సరం విడుదల అయ్యింది. ఈ మూవీ కూడా ఈమెకు మంచి గుర్తింపు ను తీసుకువచ్చింది. ఇలా 1996 వ సంవత్సరం విడుదల అయ్యి ఈమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చిన ఈ సినిమా తర్వాత 28 సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ ఈ బ్యూటీ కి సంజయ్ దర్శకత్వంలో నటించే అవకాశం రాలేదు. మరి ఈ వెబ్ సిరీస్ తో ఈమెకు ఎలాంటి ప్రశంసలు దక్కుతాయో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: