రష్మిక మందన ఇప్పటి వరకు తన కెరీర్ లో కొన్ని సినిమాలను వదులుకుంది. ఆ మూవీ లు ఏవో తెలుసు కుందాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆచార్య" మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో పూజా హెగ్డే , చరణ్ కు జోడి గా నటించింది. ఆ పాత్ర కోసం మొదట రష్మిక ను సంప్రదించగా ... ఆ సమయంలో ఇతర మూవీలతో ఫుల్ బిజీగా ఉండడంతో రష్మికమూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేయగా ఆ అవకాశం పూజ హెగ్డే కు దక్కింది.

విజయ్ హీరోగా రూపొందిన మాస్టర్ మూవీ లో హీరోయిన్ అవకాశం మొదట రష్మిక కే వచ్చిందంట . కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈమె ఆ సినిమాలు చేయగా ఆ స్థానంలోకి మాళవిక మోహన్ ఎంటర్ అయ్యింది.

విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ లో కూడా మొదట రష్మిక నే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఈమె ఈ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో అందులో పూజ హెగ్డే ను సెలెక్ట్ చేసుకున్నారు.

నాని హీరోగా రూపొందిన అంటే సుందరానికి మూవీ లో హీరోయిన్ గా రష్మీక కే ఫస్ట్ ఆఫ్ఫెర్ వచ్చింది. కానీ ఈమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది.

బంగార్రాజు మూవీ లో చైతన్యక్కు జోడిగా ఫస్ట్ ఈమెని అనుకున్నారట. ఆ పాత్ర కోసం ఈ బ్యూటీ ని సంప్రదించగా ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేయగా కృతి శెట్టి ని ఈ మూవీ బృందం ఆ పాత్రలో ఎంపిక చేసుకుంది.

మూవీ లతో పాటు మహా సముద్రం ,  గంగుబాయి కథియవడి వంటి పలు సినిమాలను కూడా ఈ బ్యూటీ పలు కారణాల వల్ల రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: