తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటువంటి నారా లోహిత్ కొంత కాలం క్రితం ప్రతినిధి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.  శుభ్ర అయ్యప్ప , శ్రీవిష్ణు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా... ప్రతాప్ మండల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . 2014 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ఆ టైం లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి విజయం సాధించింది. 

సినిమా మంచి విజయం సాధించడంతో నారా రోహిత్ తాజాగా "ప్రతినిధి 2" అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ సినిమాకి మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహించాడు . ఈ సినిమాను ఏప్రిల్ 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయనున్నారు . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను ఒకే ఒక్క సంస్థకు అమ్మి వేసింది.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యొక్క వరల్డ్ వైస్ థియేటర్ హక్కులను అమోఘ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సంస్థ వారు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే పనులను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nr